Sushant Singh Rajput: నువ్వు దూరమయ్యి ఐదేళ్లయ్యింది !

సుశాంత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు పురోగతిపై కీలక సమాచారం పంచుకున్నారు.


Published Jun 14, 2025 02:07:00 PM
postImages/2025-06-14/1749890340_SushantSinghRajputPassesAwayPhotoGallery19.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి నేటికి ఐదేళ్లు పూర్తయ్యింది. 2020 జూన్ 14న ఆయన మరణవార్త యూవత్ సినీ పరిశ్రమను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంధర్భంగా ఆయన సోదరి శ్వేతా సింగ్ కీర్తి తన సోదరుడిని స్మరించుకుంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు పురోగతిపై కీలక సమాచారం పంచుకున్నారు.


"ఈ రోజు అన్నయ్య 5వ వర్థంతి. 2020 జూన్ 14న అతను మరణించినప్పటి నుంచి చాలా జరిగాయి. ఇప్పుడు సీబీఐ కోర్టుకు ఒక నివేదిక సమర్పించింది, దానిని పొందే ప్రక్రియలో ఉన్నాం"  "అతని చిరునవ్వు, కళ్ళలోని అమాయకత్వం ఎవరి హృదయాన్నైనా ప్రేమతో కదిలించగలవు. అదే మన సుశాంత్" అని ఆమె పేర్కొన్నారు. నువ్వు చనిపోయి ఐదేళ్లు అయిపోయాయంటే నమ్మబుధ్ది కాలేదు. సుశాంత్ కు నెగిటివ్ పీపుల్ నచ్చరు. జీవితం పట్ల పిల్లల అమాయకత్వం చూపిన ప్రతిసారీ, మరింత నేర్చుకోవాలనే ఆసక్తి చూపిన ప్రతిసారీ, మనం అతన్ని బ్రతికిస్తున్నాం. అని తెలిపారు.


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్ 14న తన నివాసంలో ఉరివేసుకుని మరణించినట్లు వార్తలు వచ్చాయి. పోస్ట్‌మార్టం నివేదికలో కూడా ఊపిరాడకపోవడం వల్లే మరణం సంభవించిందని తేలింది. ఈ కేసు ఫస్ట్ ఆత్మహత్య అని చెప్పినా తర్వాత సీఐబీ కి అప్పగించారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sushanth-singh-rajputh murder

Related Articles