AMERICA: పాకిస్థాన్ పరువు తీసేసిన అమెరికా !

పాకిస్థాన్ చేసిన ప్రచారాన్ని అమెరికా ఖండించింది. మేం ఏ విదేశీ సైనిక నాయకుడిని ఆహ్వానించలేదని క్లారిటీ ఇచ్చింది.


Published Jun 15, 2025 02:38:00 PM
postImages/2025-06-15/1749978548_asifmunirdonaldtrump.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పాకిస్థాన్ అడిగి మరీ ..కొట్టించుకుంది. అమెరికా ఘోరంగా పరువు తీసేసింది.అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ నిర్వహించ తలపెట్టిన సైనిక దినోత్సవ పరేడ్ కు తమ దేశ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ను ఆహ్వానించారంటూ పాకిస్థాన్ చేసిన ప్రచారాన్ని అమెరికా తిప్పి కొట్టింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ నిర్వహించ తలపెట్టిన సైనిక దినోత్సవ పరేడ్‌కు తమ దేశ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను ఆహ్వానించారంటూ పాకిస్థాన్ చేసిన ప్రచారాన్ని అమెరికా ఖండించింది. మేం ఏ విదేశీ సైనిక నాయకుడిని ఆహ్వానించలేదని క్లారిటీ ఇచ్చింది.


1775 జూన్ 14న అమెరికా సైన్యం అధికారికంగా ఏర్పాటైన రోజును పురస్కరించుకుని ఏటా ఈ పరేడ్ నిర్వహిస్తారు. అమెరికా స్వాతంత్ర్యం పొందడానికి ఏడాది ముందు బ్రిటిష్ వలసవాదులపై పోరాటానికి ఈ సైన్యం ఏర్పడింది. ఈ తేదీ ట్రంప్ 79 వ జన్మదినోత్సవం సమాంతరంగా రావడం గమనార్హం. ఆయనే ఈ పరేడ్ లో గౌరవ వందనం స్వీకరించారు. ఈ నేపథ్యంలో, అసిమ్ మునీర్‌కు అమెరికా సైనిక పరేడ్‌కు ఆహ్వానం అందిందని ఇస్లామాబాద్ వర్గాలు తొలుత వార్తలు ప్రచారం చేశాయి. అమెరికా పేరుతో పాకిస్థాన్ పరువు పెంచుకోవాలని చూస్తే అమెరికా బహిరంగంగా పరువు తీసేసింది.


ఇక శనివారం జరిగిన సైనిక పరేడ్‌లో వేలాది మంది సైనికులు, డజన్ల కొద్దీ ట్యాంకులు, ఇతర సైనిక వాహనాలతో పాటు హెలికాప్టర్లు, పారాట్రూపర్లు పాల్గొన్నారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు లేదా ఫ్రాన్స్ బాస్టిల్ డే పరేడ్‌ల వలే అమెరికాలో సైనిక పరేడ్‌లు నిర్వహించే సంప్రదాయం లేదు కాబట్టి, ఇది ఒక విశిష్టమైన ప్రదర్శనగా నిలిచింది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu america pakistan

Related Articles