ఈ పాటలో నటుడు నందకిషోర్ నటించారు. ఈ పాటను బీహెచ్ .వీ రామకృష్ణ రాజు నిర్మాణంలో డైరక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించాడు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : భిక్షాటన రహిత సమాజం సాధించాలనే సందేశాన్ని తెలిపేలా ధర్మ యుగం పేరుతో వందేమాతరం శ్రీనివాస్ ఓ పాటను పాడి రూపొందించారు. ఈ పాటలో నటుడు నందకిషోర్ నటించారు. ఈ పాటను బీహెచ్ .వీ రామకృష్ణ రాజు నిర్మాణంలో డైరక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించాడు.
రీసెంట్ గా ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ హైద్రాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ధర్మ యుగం – హ్యూమానిటీ బెగ్గర్ ఫ్రీ సిటీ అనే ట్యాగ్ లైన్ తో ఈ సాంగ్ ని విజేత సంస్థ పూర్వ విద్యార్థులు విజేత సంస్థల చైర్మన్ తో కలిసి తీసుకువచ్చారు. ఈ పాట లాంచింగ్ ఈవెంట్ లో ఎమ్మెల్యే రాజశ్వర్ రెడ్డి ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాట పాడిన సింగర్ వందేమాతరం శ్రీనివాస్ , నటుడు నందకిషోర్ పాల్గొన్నారు.
ఈ పాట ద్వారా సమాజంలో అందరు కలిస్తేనే బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చవచ్చు అన్నారు. ఈ సంధర్భంగా అనాధలకు లాస్ట్ రైట్స్ నిర్వహిస్తున్న ఎన్జీవో , బిక్షాటన రూపు మాపేందుకు కృషి చేస్తున్న స్వచ్చంధ సంస్థలు , పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న డాక్టర్స్ ను అవార్డులతో సన్మానించారు.