Venuswamy:వేణు స్వామి ఫామ్ హౌస్ అక్రమ ఆస్తా? ఆయనకు బినామీ? 

వేణు స్వామి  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈయన పేరు వినపడుతోంది. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు. అలాంటి వేణు స్వామి  జాతకాలు చెబితే


Published Aug 23, 2024 03:24:42 PM
postImages/2024-08-23//1724406882_VENU.jpg

న్యూస్ లైన్ డెస్క్: వేణు స్వామి  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈయన పేరు వినపడుతోంది. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు. అలాంటి వేణు స్వామి  జాతకాలు చెబితే  ఒక్కొక్కసారి నిజం అవుతోంది. ఒక్కోసారి బెడిసి కొడుతూ ఉంటాయి. నీటిలో రాయి వేసినట్టు ఏదైనా విషయాన్ని చెబితే  అది నిజమైతే నేను చెప్పాను అంటారు. అది అబద్ధమైతే కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా వేణు స్వామి ఎంతో ఫేమస్ అయి  రెండు చేతుల సంపాదిస్తున్నారు.

అలాంటి వేణు స్వామికి మరియు జర్నలిస్టు మూర్తికి మధ్య వార్ జరుగుతుంది. జర్నలిస్టు మూర్తిపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను జర్నలిస్టు మూర్తి ఇప్పటికే క్రిమినల్ డెఫమెషన్ కేసు ఫైల్ చేయడానికి నోటీసులు పంపారు. అంతేకాకుండా ఆయన వేణు స్వామి గురించి ఆయన భార్య బినామీ బాగోతాల గురించి కూడా బయట పెట్టెందుకు సిద్ధమైపోయాడు. ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి గ్యాంగ్ స్టార్, రాజకీయ వేత్త గాయత్రీ ప్రజాపతికి వేణు స్వామి బినామీ అని మూర్తి సంచలన ఆరోపణలు చేశారు.  

గతంలో వేణు స్వామి ప్రజా ప్రతిని కలిసినటువంటి ఫోటోలను కూడా ఆయన బయటపెట్టారు.  అయితే వేణు స్వామి అక్కడికి వెళ్లారా లేదంటే గాయత్రి ప్రజాప్రతి ఇక్కడికి వచ్చారా అనేది స్పష్టత లేదు కానీ ఆయనకు ఈయన బినామీగా ఉన్నారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే గాయత్రి ప్రజాపతి అత్యా, అత్యాచారం కేసుల్లో శిక్షకు గురై జైల్లో ఉన్నారు.  తాజాగా వేణు స్వామి భార్య శ్రీవాణి తన పామ్ హౌస్ లో టీ తాగుతూ ఫామ్ హౌస్ గురించి ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది.

https://x.com/murthyscribe/status/1826850480456159379?t=tcQ2FmLQc3RmIoqc2oDfHA&s=08

 హైదరాబాద్ శివార్లలో కోట్ల విలువ చేసే ఫామ్ హౌస్ లు వారివి కాదని, గాయత్రి ప్రజాప్రతివే అని జర్నలిస్టు మూర్తి ఆరోపణలు చేస్తున్నారు. అక్రమ ఆస్తులపై ఈడి, సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా వేణు స్వామి సంబంధించిన వ్యవహారంలో మూర్తి ఒక్కొక్క నిజాన్ని బయటకు లాగుతూ  ప్రజలకు చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో వేణు స్వామి దంపతులు ప్రతిక్షణం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu up venu-swamy gayatri-prajapathi journalist-murthi binami-properties

Related Articles