VIRAL: భర్తపై భార్య గృహహింస కేసు.. అవాక్కయిన హైకోర్టు !

తనను భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. తన భర్త ఎప్పుడు జంక్ ఫుడ్ తిననివ్వడం లేదని కేసు పెట్టింది


Published Aug 24, 2024 09:11:00 PM
postImages/2024-08-24/1724514373_8662f4b4646ab9c502e81e4fe5e5b929original.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: భార్యా భర్తల మధ్య గొడవలు ఎవరికి రావు. గొడవలు పడడం లేదంటేనే ..అనుమానించాలి..నిజమైన భార్యా భర్తలా కాదా అని..రీసెంట్ గా ఓ భార్యచేసిన పనికి ఆ జడ్జి షాక్ అయిపోయారు. రీసెంట్ గా ఓ బిడ్డను ప్రసవించిన భార్య.. తనను భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. తన భర్త ఎప్పుడు జంక్ ఫుడ్ తిననివ్వడం లేదని కేసు పెట్టింది మహాతల్లి. అది కూడా కేసు గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేయడంతో అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 


ఎక్కడో ఫారన్ లో అనుకుంటున్నారేమో కాదమ్మా...మన ఇండియాలోనే. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. తనను భర్త ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తిననీయడం లేదన్న కారణంతోనే ఆమె ఈ కేసు పెట్టినట్టిందట. పుట్టిన బిడ్డకు పాలు ఆరోగ్యం గా రావాలంటే ..జంక్ వద్దని అన్నందుకు కేసు పెట్టింది. అది కూడా గృహహింసచట్టం . దీంతో జడ్జికి తిక్క లేసి అన్ని చోట్లా అతనిపై నమోదైన కేసులపై స్టే విధిస్తున్నట్లు న్యాయమూర్తి ఆర్డర్ పాస్ చేశారు.


ఒక్క భర్త పైనే కాదు ...అతడి తల్లిదండ్రులపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 498ఏ కింద గృహ హింస కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో బాధితుడు హైకోర్టును ఆశ్రయించి.. తనపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరాడు. వాదనలు విన్న ..జడ్జి ఇది సరి కాదని .. చట్టాలను, కోర్టు టైం ను ఇంత టైం వేస్ట్ చేయడంపై సీరియస్ అవుతూ కేసును కొట్టేసింది. ఉద్యోగ పనిమీద అతడు అమెరికా వెళ్లేందుకు అనుమతించింది. పాపం ఈ ఇన్సిడెంట్ తో భర్తకు , ఆ కేసు వాదించిన జడ్జికి ఫ్యూజులు ఎగిరిపోయాయంటే నమ్మండి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news karnataka- junk-food

Related Articles