ఆఫ్ఘనిస్థాన్ , ఇరాన్ , యోమెన్ , మయన్మార్ , చాడ్ , కాంగోరిపబ్లిక్ , ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ దేశాలపై ట్రంప్ నిషేధం విధించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. 12 దేశాల పౌరుల రాకపై అమెరికాలో నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఏడుదేశాల పై అమెరికా ఇన్ డైరక్ట్ గా నిషేధం విధించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు జూన్ 9 నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. కొలరాడోలో యూదు సమూహంపై ఓ వ్యక్తి దాడి చేసిన తర్వాత అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
ఆఫ్ఘనిస్థాన్ , ఇరాన్ , యోమెన్ , మయన్మార్ , చాడ్ , కాంగోరిపబ్లిక్ , ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ దేశాలపై ట్రంప్ నిషేధం విధించారు. ఇవే కాకుండా మరో ఏడు దేశాల జాబితాను కూడా చేర్చింది. బురుండి, క్యూబా, లావోస్, సియోర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్థాన్, వెనిజులా ఉన్నాయి. దేశ భద్రతను , అమెరికా పౌరుల ప్రయోజనాలను కాపాడటం కోసమే ఈ చర్య తీసుకోవల్సి వచ్చిందని ట్రంప్ తన ప్రకటనలో తెలిపారు.
'కొలరాడోలోని బౌల్డర్లో ఇటీవల ఉగ్రదాడి జరిగింది. సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు దేశంలో ఉండటం కారణంగానే అలాంటి ఘటనలు జరుగుతున్నాయి. యెమెన్, సోమాలియా, హైతీ, లిబియాతో సహా పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించే ఉత్తర్వులపై సంతకం చేస్తున్నా' అని ట్రంప్ తెలిపారు. దేశ పౌరుల రక్షణకు తను ఎంత కఠినమైన నిర్ణయాలైనా తీసుకుంటానని తెలిపారు.