విచారణ సమయంలో ‘భారత్-పాక్ ఉద్రిక్తతల అంశాన్ని ట్రంప్ సర్కారు ప్రస్తావించగా.. కోర్టు దాన్ని తోసిపుచ్చింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రెండోసారి అమెరికా అధ్యక్షబాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా " లిబరేషన్ డే " పేరుతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించారు. ఈ సుంకాల విషయంలో అధ్యక్షుడు ట్రంప్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ టారిఫ్ లు అమలుకు యూఎస్ ట్రేడ్ కోర్టు బ్రేక్ వేసింది. టారిఫ్ లు విధించే అధికారం ట్రంప్ కు లేవని తేల్చి చెప్పింది. చాలా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ ఆర్ధిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ఇలాంటి ఆంక్షలు చేసే అవకాశం ఉంది.విచారణ సమయంలో ‘భారత్-పాక్ ఉద్రిక్తతల అంశాన్ని ట్రంప్ సర్కారు ప్రస్తావించగా.. కోర్టు దాన్ని తోసిపుచ్చింది.
చట్టపరంగా ఎదురైన ఈ సవాల్.. చైనాతో వాణిజ్య సంధిని మార్చేస్తుందని, భారత్-పాక్ మధ్య ఘర్షణలను పెంచుతుందని అధికారులు వాదించారు. టారిఫ్ అధికారం వల్లనే భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాధించగలిగారని కోర్టుకు తెలిపారు. ఈ ట్రేడ్ డీల్స్ను ఖరారు చేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఉందని, అప్పటివరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరింది. అయితే ట్రంప్ అడ్మిస్ట్రేషన్ చేసిన అన్ని వాదనలను కోర్టు తిరస్కరించింది.