పదికి పైగా సాయుధ డ్రోన్లు , ఒక సీ -130 హెర్యులస్ రవాణా విమానం ధ్వంసం అయినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూ లో పాకిస్థాన్ భారీ నష్టం చూస్తుంది. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు భారత్ తీవ్రంగా స్పందించింది. మే నెల మొదట్లో ప్రారంభమైన ఆపరేషన్ సిందూర్ లో పాక్ వైమానిక దళానికి చెందిన ఆరు యుధ్ధవిమానాలు రెండు అత్యంత కీలకమైన నిఘావిమానాలు పదికి పైగా సాయుధ డ్రోన్లు , ఒక సీ -130 హెర్యులస్ రవాణా విమానం ధ్వంసం అయినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
సైనిక ఘర్షణ తర్వాత జరిపిన విశ్లేషణలో పాకిస్థాన్ వైమానిక, భూతల సైనిక ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు స్పష్టమవుతుంది. భారత వైమానిక దళం జరిపిన ఎదురుదాడుల్లో ఈ ఆరు పీఏఎఫ్ యుద్దవిమానాలు గాల్లోనే నేలకూలాయి. పాకిస్థానీ పంజాబ్ , పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాడార్ ట్రాకింగ్, భారత భూస్థిత క్షిపణి వ్యవస్థలు, గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు నమోదు చేసిన థర్మల్ సిగ్నేచర్ల ద్వారా ఈ విమానాల విధ్వంసాన్ని ధ్రువీకరించినట్టు సమాచారం. దాడుల అనంతరం ఈ విమానాలు ట్రాకింగ్ గ్రిడ్ల నుంచి అదృశ్యమైనట్లు ఈ వర్గాలు పేర్కొన్నాయి.