సింధు బేసిన్ నుంచి పాక్ డ్యామ్ లకు నీరు విడుదల చెయ్యడం తగ్గిందని తెలిపారు. ఇది ప్రతి ఏడాది జరిగేదాని కంటే 13.3 శాతం తక్కువ.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భారత్ తీసుకున్న కఠిన నిర్ణయంలో సింధూ జలాల నీరు నిలిపేయడం . అప్పటి నుంచి పాకిస్థాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో, ఇప్పటికే నీటి కొరతతో అల్లాడుతున్న పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు సింధు నదీ వ్యవస్థ నుంచి అందే నీటిలో భారీగా కోత పడింది. జూన్ 5 న సింధు బేసిన్ నుంచి పాక్ డ్యామ్ లకు నీరు విడుదల చెయ్యడం తగ్గిందని తెలిపారు. ఇది ప్రతి ఏడాది జరిగేదాని కంటే 13.3 శాతం తక్కువ.
ఈ నీటి కొరత ఖరీఫ్ పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ లో సింధు నదీ వ్యవస్థకు అనుసంధానంగా ఉన్న నదులు , జలాశయాలు నీటిమట్టం తగ్గింది. సాధారణంగా జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో పాక్ పంజాబ్కు రుతుపవనాలు చేరుకుంటాయని, అప్పటివరకు ఈ సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సింధు జలాల ఒప్పందం ప్రకారం రావి, జీలం, సింధు నదులు పాకిస్థాన్కు కేటాయించబడినప్పటికీ, అవి భారత్ గుండా ప్రవహించి పాక్లోకి వెళతాయి. సట్లెజ్, బియాస్, చీనాబ్ నదులపై భారత్కు హక్కులున్నాయి. పశ్చిమ నదుల జలాలను కూడా పాక్కు నష్టం వాటిల్లకుండా వాడుకునే హక్కు భారత్కు ఉంది. ఒప్పందం నిలిపివేయడంతో పశ్చిమ నదుల ప్రవాహాన్ని భారత్ కొంత వరకు నియంత్రించగలుగుతుంది. దీంతో పాకిస్థాన్ దాదాపు నాలుగు సార్లు లేఖలు రాసింది. ఎలాగైనా సింధుజలాలపై మరోసారి ఆలోచించాలని కోరారు.