పశ్చిమ నదులైన సింధు , జీలం , చీనాబ్ నదుల నుంచి భారత్ కు కేటాయించిన వాటాను సంపూర్ణంగా వాడుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సింధు జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే దిశగా భారత్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ లోని అదనపు జలాలను పంజాబ్ , హర్యానా , రాజస్థాన్ రాష్ట్రాలను తరలించేందుకు 113 కీలోమీటర్ల పొడవైన కాలువను నిర్మించాలని యోచిస్తుంది. ఈ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలను భారత్ ఇంకా అద్యయనం చేస్తుంది. తూర్పు నదులైన రావి, బియాస్ , సట్లెజ్ నదుల పూర్తి వినియోగంతో పాటు , సింధు జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులైన సింధు , జీలం , చీనాబ్ నదుల నుంచి భారత్ కు కేటాయించిన వాటాను సంపూర్ణంగా వాడుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితంగా పాకిస్థాన్ కు వెళ్తున్న అదునపు సింధూ జలాల ప్రవాహం చాలా వరకు తగ్గిపోతుంది.
జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఉయ్జ్ బహుళార్థ సాధక ప్రాజెక్టును (జలవిద్యుత్, సాగునీరు, తాగునీరు) కూడా పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించింది. చీనాబ్ నదిని రావి- బియాస్ - సట్లెజ్ నదులతో కలుస్తున్న కాలువను ఇప్పటికే జమ్మూ , పంజాబ్ , హర్యానా , రాజస్థాన్ లలోని 13 ప్రాంతాలలో కలుపుతుందని సంబంధింత అధికారులు తెలిపారు."రాబోయే మూడేళ్లలో సింధు జలాలను కాలువల ద్వారా రాజస్థాన్లోని శ్రీ గంగానగర్కు తీసుకువెళ్తాం. దీనివల్ల దేశంలోని పెద్ద విస్తీర్ణంలో సాగునీటి సౌకర్యాలు మెరుగుపడతాయి, అదే సమయంలో పాకిస్థాన్ ప్రతి నీటి బొట్టు కోసం అల్లాడుతుంది" కూడా అన్నారు.