ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్పై విజయాన్ని సాధించాడు. క్లాసికల్ చెస్ పోటీల్లో కార్ల్ సన్ ను ఓడించడం గుకేశ్ కు ఇదే మొదటిసారి .
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారత్ గ్రాండ్ మాస్టర్ డి గుకేశ్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా గూకేష్ విషయాలే 18 ఏళ్ల వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్ అయ్యి టాప్ 5 ర్యాకింక్ లో ఉన్నాడు. 18 ఏళ్ల వయసులో గూకేశ్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. ఎందరో గ్రాండ్ మాస్టర్స్ ను వరల్డ్ ఛాంపియన్స్ ను ఓడించి ... నార్వే చెస్ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ మరోసారి తన ప్రతిభను నిరూపించాడు. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్పై విజయాన్ని సాధించాడు. క్లాసికల్ చెస్ పోటీల్లో కార్ల్ సన్ ను ఓడించడం గుకేశ్ కు ఇదే మొదటిసారి . ఈ గెలుపుతో ఫస్ట్ రౌండ్ ఓటమికి గూకేశ్ ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. అయితే తన ఓటమిని తట్టుకోలేక కార్లసన్ టేబుల్ ను గట్టిగా గుద్దిన వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. దీనికి గుకేశ్ రియాక్షన్ కూడా వైరల్ అవుతుంది. అయితే చెస్ చరిత్రలో నంబర్ వన్ ఆటగాడిని మన ఇండియన్ అది కూడా 18ఏళ్ల కుర్రాడు ఓడించాడంటే చాలా గ్రేట్ .
గతేడాది జరిగిన ఇదే టోర్నీలో మరో భారత స్టార్ ప్రజ్ఞానంద చేతిలో కార్ల్సన్ ఓడిపోయాడు. గుకేశ్ 12 సంవత్సరాల ఏడు నెలల 17 రోజుల వయస్సులో భారతదేశపు అతి పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ఇప్పుడు 18ఏళ్లకే ప్రపంచ చెస్ ఛాంపియన్గా 36ఏళ్ల తర్వాత రికార్డును భారత్ కు దక్కించాడు.ఇన్ని రికార్డులున్న గూకేశ్ జస్ట్ నాలుగో తరగతి వరకే స్కూల్ కి వెళ్లి చదువుకున్నాడు. తర్వాత అంతా స్కూల్ కు దూరంగా ఉండి చదువుకోవడమే.
డి గుకేశ్ పూర్తి పేరు దొమ్మిరాజు గుకేష్. చెన్నై నివాసి. తండ్రి డాక్టర్ రజనీకాంత్, తల్లి డాక్టర్ పద్మ మైక్రోబయాలజిస్ట్. పేరెంట్స్ చాలా సపోర్ట్ చెయ్యడం వల్ల గూకేశ్ ఈ స్థాయికి వచ్చాడు. గూకేశ్ తండ్రి తన ఉద్యోగాన్ని వదిలి కొడుకుతో పాటు కోచింగ్స్ కు తిరగడం గూకేశ్ కెరియర్ మరో మెట్టు పైకి వెళ్లడం జరిగింది. గూకేశ్ చెన్నైలోని వేలమ్మాళ్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకునేవాడు. చెన్నైలోని వేలమ్మాళ్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ (మొగప్పైర్ బ్రాంచ్)ని చెస్ ఫ్యాక్టరీ అంటారు. 17 మంది భారతీయ గ్రాండ్ మాస్టర్లు డి గుకేశ్ ప్రజ్ఞానంద్, ఎ అధిబన్ మరియు ఎస్పీ సేతురామన్ ఈ పాఠశాల నుండి డిగ్రీలు పొందిన వారే. గూకేశ్ భారతదేశానికి ఎంతో పేరు తెచ్చారు. 18 యేళ్ల వయసులో తన వయసుకు మించి భారత్ పేరును ఉన్నత శిఖరాల్లో ఉంచారు.