NBEMS ప్రకారం, నీట్ పీజీ 2025 పరీక్షను ఒకే షిఫ్ట్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడానికి ఈ వాయిదా నిర్ణయం తీసుకోబడింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : నీట్ పీజీ 2025 పరీక్ష వాయిదా వేయబడినట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) తెలిపింది. వచ్చే నెల జూన్ 15, 2025న జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేసింది. కొత్త పరీక్ష తేదీని త్వరలో అనౌన్స్ చేయబోతున్నట్లు తెలిపారు.
NBEMS ప్రకారం, నీట్ పీజీ 2025 పరీక్షను ఒకే షిఫ్ట్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడానికి ఈ వాయిదా నిర్ణయం తీసుకోబడింది. అయితే గతంలో రెండు షిప్ట్ లలో పరీక్ష నిర్వహించాలని NBEMS ప్లాన్ చేసింది.అయితే అభ్యర్ధుల నుంచి వ్యతిరేకత , సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని నిర్ణయించింది. సుప్రీం కోర్టు మే 30, 2025న రెండు షిఫ్ట్ల నిర్ణయాన్ని రద్దు చేసిన నేపథ్యంలో, NBEMS ఈ పరీక్షను ఆగస్టు 3, 2025న ఒకే షిఫ్ట్లో నిర్వహించే అవకాశం ఉందని తెలిపింది.