అయితే సిలబస్ మార్పుపై కసరత్తు చేస్తున్నామని, కోర్సుల ఎంపికపై విద్యార్థులకు హెల్ప్లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : జులై మొదటి వారంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఉంటుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఆగస్టు 14 లోపు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి అవుతుందని అన్నారు. అలాగే ఆగస్టు 14 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
అయితే సిలబస్ మార్పుపై కసరత్తు చేస్తున్నామని, కోర్సుల ఎంపికపై విద్యార్థులకు హెల్ప్లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నాలుగు విద్యాసంస్థలు అనుమతిలేకుండా నడుపుతున్నారని ..ఈ అనధికార విద్యాసంస్థల్లో విద్యార్ధులు జాయిన్ అవుతున్నారు. ఆ నాలుగు విద్యాసంస్థలకు లీగల్ నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. నెక్స్ట్ వేవ్ , బైట్ ఎక్స్ ఎల్ టెక్ ఎడ్ , లీప్ స్టార్ట్ , ఇంటెల్లిపాత్ సంస్థలకు నోటీసులు ఇచ్చామన్నారు.
వివరణ కోసం ఈనెల 13 వరకు విద్యాసంస్థలకు గడువు ఇచ్చామన్నారు. డీమ్డ్ వర్సిటీలతో ఒప్పందం చేసుకున్నట్లు విద్యాసంస్థలు తెలుపుతున్నాయని అన్నారు. అలాగే ఇంజినీరింగ్ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట జేఈఈ కౌన్సిలింగ్ కాకుండా రాష్ట్రంలో కౌన్సిలింగ్ చేపట్టలేమని ఆయన పేర్కొన్నారు.