engineering : జులై మొదటివారం నుంచే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ !


అయితే సిలబస్​ మార్పుపై కసరత్తు చేస్తున్నామని, కోర్సుల ఎంపికపై విద్యార్థులకు హెల్ప్​లైన్​ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు.


Published Jun 10, 2025 08:36:00 PM
postImages/2025-06-10/1749568060_student.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : జులై మొదటి వారంలో ఇంజినీరింగ్​ కౌన్సెలింగ్ ఉంటుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఆగస్టు 14 లోపు ఇంజినీరింగ్​ కౌన్సెలింగ్​ ప్రక్రియ పూర్తి అవుతుందని అన్నారు. అలాగే ఆగస్టు 14 నుంచి ఇంజినీరింగ్​ తరగతులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 


అయితే సిలబస్​ మార్పుపై కసరత్తు చేస్తున్నామని, కోర్సుల ఎంపికపై విద్యార్థులకు హెల్ప్​లైన్​ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నాలుగు విద్యాసంస్థలు అనుమతిలేకుండా నడుపుతున్నారని ..ఈ అనధికార విద్యాసంస్థల్లో విద్యార్ధులు  జాయిన్ అవుతున్నారు. ఆ నాలుగు విద్యాసంస్థలకు లీగల్ నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. నెక్స్ట్ వేవ్ , బైట్ ఎక్స్ ఎల్ టెక్  ఎడ్ , లీప్ స్టార్ట్ , ఇంటెల్లిపాత్ సంస్థలకు నోటీసులు ఇచ్చామన్నారు.


వివరణ కోసం ఈనెల 13 వరకు విద్యాసంస్థలకు గడువు ఇచ్చామన్నారు. డీమ్డ్​ వర్సిటీలతో ఒప్పందం చేసుకున్నట్లు విద్యాసంస్థలు తెలుపుతున్నాయని అన్నారు. అలాగే ఇంజినీరింగ్​ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట జేఈఈ కౌన్సిలింగ్ కాకుండా రాష్ట్రంలో కౌన్సిలింగ్ చేపట్టలేమని ఆయన పేర్కొన్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu students engineering

Related Articles