ఈ పరీక్షకు ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభ్యర్ధులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఏపీ లో మెగా డిఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఈ పరీక్షలు జూన్ 6 నుంచి 30 వరకు జరిగేలా ఏర్పాట్లు చేశారు. విద్యాశాఖ ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తుంది.ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మొత్తం 16,347 పోస్టుల కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభ్యర్ధులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేస్తున్నారు.
మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు ఈ పరీక్షలో పాల్గొనడానికి నమోదు చేసుకున్నారు. ఈ సంఖ్యలో తెలంగాణ , కర్ణాటక , తమిళనాడు, ఒడిశా లాంటి పక్క రాష్ట్రాల నుంచి కూడా అభ్యర్ధులు ఉన్నారు. ఈ కారణంగా పరీక్ష కేంద్రాలు ఆ రాష్ట్రాలలో కూడా ఏర్పాటు చేశారు. దరఖాస్తు టైంలో అభ్యర్ధుల నుంచి పరీక్షా కేంద్రాల విషయంలో ఆప్షన్స్ స్వీకరించారు.