Anganwadi : అంగన్వాడీ గుడ్లు.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు


Published Aug 30, 2024 07:31:12 PM
postImages/2024-08-30/1725026472_ponguleti.jpg

న్యూస్ లైన్ డెస్క్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అంగన్వాడీ గుడ్లు, పౌష్టికాహారం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తరలిపోతున్నాయి. తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయి సెక్టార్ పరిధిలోని పలు అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణీలకు అందించాల్సిన గుడ్లు దొడ్డిదారిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తరలిస్తున్నారు. సూపర్ వైజర్ పట్టించుకోకపోవడంతో అంగన్ వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్న టీచర్లు, ఆయాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అసలు అంగన్ వాడీ కేంద్రాన్ని తెరవకుండానే గుడ్లు, ఇతర పౌష్టికాహార పదార్థాలు బ్లాక్ లో అమ్మేసుకుంటున్నారు.

అంగన్ వాడీ గుడ్లు బ్లాక్ లో అమ్ముకుంటున్న వారిపై కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అంగన్ వాడీ టీచర్లు ఇష్టానుసారంగా సొంత ఎజెండాను అమలు చేస్తున్నారని గర్భిణీలు, బాలింతలు వాపోతున్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news tspolitics anganwadi ministerponguletisrinivasreddy education egg-born

Related Articles