బడ్జెట్ కాని అందుబాటులో ఉంటే మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు భారతీయులు ఎంజాయ్ చెయ్యడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి జనాలు లైఫ్ ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టారు. బడ్జెట్ పరిమితుల వల్ల వెనకడుగు వేస్తుంటారు. అయితే బడ్జెట్ కాని అందుబాటులో ఉంటే మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు భారతీయులు ఎంజాయ్ చెయ్యడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అలా బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు చూద్దాం.
థాయ్లాండ్, నేపాల్, భూటాన్, శ్రీలంక వంటి దేశాలు ఉన్నాయి.అయితే అక్కడ ఏం ఏం ఉన్నాయో...చూసుకుందాం. థాయిలాండ్ ఎప్పుడు బిజీ బిజీ రోడ్లు ...అధ్భుతమైన బీచ్ లు , చాలా బ్యూటిఫుల్ కల్చర్. భారతీయులు కాని ప్రయాణికులు ఇప్పుడు 30 రోజుల వరకు వీసా లేకుండానే థాయిలాండ్ వెళ్లొచ్చు. మాయి, క్రాబీ వంటి ప్రసిద్ధ ప్రదేశాలలో తక్కువ ధరకే వసతి, ఆహారం లభిస్తాయి.
నేపాల్ ..హిమాలయ పర్వతాల చెంతన ఉన్న నేపాల్ , ట్రెక్కింగ్ ప్రియులకు ఆధ్యాత్మిక అన్వేషకులకు స్వర్గధామం. భారతీయ పౌరులు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డుతో ఎలాంటి ఆంక్షలు లేకుండా నేపాలోకి ప్రవేశించవచ్చు.పోఖారా, ఖాట్మండు వంటి నగరాల్లో రోజువారీ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీ .
భూటాన్ స్వచ్ఛమైన పర్యావరణం. స్థూల జాతీయ సంతోష సూచిక తత్వానికి చెందిన భూటాన్ , బడ్జెట్ ప్రయాణికులకు చాలా మంచి ఆప్షన్. భారతీయులకు వీసా రహిత ప్రవేశం. హిమాలయాల్లో బెస్ట్ గెస్ట్ హౌస్ లు ఉన్నాయి. నేచరల్ గా ఎంజాయ్ చెయ్యాలంటే భూటాన్ కూడా మంచి ఆప్షన్.
భారత్ నుంచి కొద్ది దూరంలోనే ఉన్న శ్రీలంక , భారతీయ పర్యాటకులకు 30 రోజుల వరకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తోంది. ఈ ద్వీప దేశం . ద్వీప దేశం ప్రశాంతమైన సముద్రతీరాలు ప్రాచీన శిధిలాలు, పచ్చని ప్రకృతి దృశ్యాలతో అలరారుతుంది. ప్రయాణికులు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, హోమ్ స్టే లను ఎంచుకోవడం ద్వారా మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు. శ్రీలంకను బడ్జెట్ ప్రయాణానికి గొప్ప ఎంపిక గా మార్చింది.