Speed Project : స్పీడ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష


Published Aug 30, 2024 03:34:07 PM
postImages/2024-08-30/1725012247_revanthreddyreviewonspeed.jpg

న్యూస్ లైన్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు డెవలప్ మెంట్ ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాలను వేగవంతంచేయడానికి స్పీడ్ రూపొందించిన 19 ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతి కుమారి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ రమేష్ రెడ్డిలతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఆరోగ్యం, పర్యావరణం, దేవలయ, పర్యాటక అభివృద్ధిపై సీఎం చర్చించారు.

వేములవాడ ఆలయ విస్తరణకు రాష్ట్ర బడ్జెట్ లో రూ.50 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డిని వేములవాడ  ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయల అర్చకులు, అధికారులు ముఖ్యమంత్రిని కలిసి ఆలయ విస్తరణ వేగంగా పూర్తి చేయాలని కోరారు. అందుకు అవసరమైన శృంగేరి పీఠం అనుమతిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అర్చకులకు సీఎం సూచించారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news revanth-reddy tspolitics cm-revanth-reddy review devotional

Related Articles