COVID Vaccine: కోవిడ్ బూస్టర్ డోస్ వేసుకున్నవారికి మరోసారి కోవిడ్ రాదా !

కరోనా వ్యాప్తి చెందుతున్న వేగాన్ని చూస్తే మునుపటి కోవిడ్ పరిస్థితులు వస్తాయేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


Published Jun 04, 2025 06:11:00 PM
postImages/2025-06-04/1749041034_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ :  దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. లాక్ డౌన్ అని మరోసారి సెకండ్ వేవ్ అని చాలా చెప్తున్నారు. కాని  కోవిడ్ పై మరో డిస్కర్షన్ కూడా నడుస్తుంది. ఇప్పటికే దేశంలో నాలుగు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేవలం రెండు వారాల్లోనే ఈ సంఖ్య రెట్టింపు అయింది. కరోనా వ్యాప్తి చెందుతున్న వేగాన్ని చూస్తే మునుపటి కోవిడ్ పరిస్థితులు వస్తాయేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


అయితే కొత్త వేరియంట్ల ప్రమాదాలను నివారించడానికి వ్యాక్సిన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. కొత్త వేరియంట్లు అంత తీవ్రంగా లేవని ,అందువల్ల ప్రస్తుతానికి అంత తీవ్రంగా లేవనే వాదనలు ఉన్నాయి. కోవిడ్ మూడు వ్యాక్సిన్స్ తీసుకున్నవారికి కరోనా సోకినప్పటికీ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండదు. ఇప్పటివరకు చేసిన పరిశోధనల ప్రకారం, కొత్త వేరియంట్ ప్రభావం 4 లేదా 8 రోజుల వరకు ఉంటుందని తెలిపారు. దీని కోసం మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.


బూస్టర్ డోస్ తీసుకున్న వారికి వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి ఉంటుందని... వారికి వైరస్ నుండి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి బూస్టర్ కారణంగా  కోవిడ్ వ్యాప్తి జరిగినా మరీ మరణాల వరకు రాదని అంటున్నారు డాక్టర్లు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health health-problems covid-time

Related Articles