ఈ " హనీ ట్రాప్ " కొనసాగుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని అసెంబ్లీలో బీజేపీ సభ్యులు లేవనెత్తారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఆరు నెలల సన్పెన్షన్ వేటు పడింది. సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకు వారిని సస్పెండ్ చేసినట్లు స్పీకర్ యూటీ ఖాదర్ తెలిపారు. ఆరు నెలల పాటు సన్పెన్షన్ కు గురైన ప్రతిపక్ష ఎమ్మెల్యే ల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వథ్ నారాయణ్ కూడా ఉన్నారు. కర్ణాటక మంత్రులు సహా చాలా మంది ప్రజాప్రతినిధులపై " హనీ ట్రాప్ " ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం అక్కడి పొలిటికల్ లైఫ్స్ ను కుదిపేసింది. చాలా మంది మంత్రులు సహా ముఖ్య నేతలే లక్ష్యంగా ఈ " హనీ ట్రాప్ " కొనసాగుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని అసెంబ్లీలో బీజేపీ సభ్యులు లేవనెత్తారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది.