MAHABHARATHAM: కర్ణుడు మూడు శాపాలంటే ..తెలుసుకుందాం రండి ? 2024-06-30 23:08:46

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మహాభారతంలో( MAHABHARATHAM)  ప్రతి పాత్ర అధ్భుతమైనదే...అసలు మహాభారతం యుగం ముగియడం కోసం ధర్మ సంస్థాపన కోసం మొదలయిన ఘట్టం. ఎన్నిసార్లు చదివినా, విన్నా ఆసక్తికరం అనిపించే క్యారెక్టర్...అయ్యో అనిపించే క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది కర్ణుడనే ( KARNA) చెప్పుకోవాలి. ఎంతటి వీరుడు కర్ణుడు. కేవలం అధర్మం పక్షాన నిలిచాడనే ఒకే ఒక్క కారణంతో కురుక్షేత్రంలో( KURUKSHETHARAM)  నేల కూలాడు. దీనికి తోడు కర్ణడుకి శాపాలు అవేంటో చూద్దాం.


భూమ్మీద పడగానే శాపగ్రస్తుడయ్యాడు కర్ణుడు. దూర్వాసుడు తనకిచ్చిన వరాన్ని పరీక్షించాలి అనుకుంది కుంతీదేవి. నదీ తీరంలో కనిపిస్తున్న సూర్యుడిని చూసి...మహర్షి తనకు ఉపదేశించిన మంత్రాన్ని పఠించింది. వెంటనే ప్రత్యక్షమైన సూర్యుడు కర్ణుడిని ప్రసాదించాడు. కవచకుండలాలతో, సూర్య తేజస్సుతో వెలిగిపోతున్న బాలుడిని చూసి కంగారుపడింది. అప్పటికి ఇంకా కుంతీదేవికి వివాహం కాలేదు. అందుకే ఆ బాలుడిని ఓ పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. అలా రథం నడుపుకునేవాని ఇంటికి చేరాడు కర్ణుడు. అందుకే సూతపుత్రుడుగా మారాడు. పాండవుల్లో అగ్రజుడైన కర్ణుడు..రాజ్యంలో భోగభాగ్యాల మధ్య పెరగాల్సినప్పటికీ రథం నడుపుకునేవానిఇంట పెరగాల్సి వచ్చింది...రాజ్యాన్ని ధారాధత్తంగా పొందాల్సి వచ్చింది. క్షత్రియుడే అయినా ...సూతపుత్రునిగా అవమానాలు పొందాడు.
ద్రోణాచార్యుడి వద్ద తానుకూడా విద్యను అభ్యసించాలి అనుకున్నాడు కర్ణుడు. కానీ అక్కడ అవమానాలు ఎదురవడంతో పరశురామునిడి ఆశ్రయించాడు. అయితే పరశురాముడికి క్షత్రియులంటే వైరం. క్షత్రియవంశ నిర్మూలనే ధ్యేయంగా పరశురాముడు ( PARASURAMUDU) మాహిష్మతి రాజ్యం మొదలు ఎందరో రాజులపై దండయాత్ర చేశాడు. అందుకే బ్రాహ్మణ పుత్రులకు తప్ప..క్షత్రియులకు విద్య నేర్పించడు పరశురాముడు. అయితే విద్య నేర్చుకోవాలన్న ఆలోచనతో తాను బ్రాహ్మణుడినే అని అబద్ధం చెబుతాడు కర్ణుడు. సకల విద్యలు నేర్పించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు పరశురాముడు. అయితే ఓ సందర్భంలో అలసిపోయిన పరశురాముడు..కర్ణుడి తొడపై తలపెట్టి నిద్రపోతాడు. ఆ సమయంలో ఓ తేనెటీగ కర్ణుడిని కుట్టేస్తుంది. రక్తం కారుతున్నప్పటికీ గురువుకి నిద్రాభంగం కలగకూడదని భరిస్తాడు కర్ణుడు. నిద్రలేచి జరిగిన సంఘటన చూసి కర్ణుడు బ్రాహ్మణుడు కాదు ఇంత బాధని భరించగలిగాడంటే క్షత్రియపుత్రుడని గ్రహిస్తాడు. అబద్ధం, మోసాన్ని సహించలేకపోయిన పరశురాముడు నువ్వు  సంపాదించిన జ్ఞానం,  నేర్చుకున్న విద్య..అత్యవసర సమయంలో మర్చిపోతావనే శాపం ఇచ్చాడు..


విద్యను అభ్యసించి ఇంటికి చేరుకున్న కర్ణుడు ఓసారి..తన విలువిద్యా నైపుణ్యాన్ని పరీక్షించుకుంటుండగా ఆ బాణం ఆవుకి తగిలింది. అప్పుడే అక్కడకు వచ్చిన ఆవు ( COW) యజమాని అయిన బ్రాహ్మణుడు.. యుధ్ద సమయంలో నీ రథ చక్రాలు నేలకొరుగుతాయని శపిస్తాడు.


ఓ చిన్నారి కోరిక మేరకు మట్టి కుండలో ఇచ్చిన నెయ్యి కిందపడింది..తల్లి కోప్పడుతుందని ఏడుపు మొదలెట్టింది. అదే నెయ్యి కావాలని పట్టుబడ్డడంతో..ఆ మట్టి నుంచి నెయ్యిని పిండి ఇచ్చి చిన్నారిని సంతోషపెట్టాడు. కానీ అదేక్షణం భూదేవి శాపానికి గురయ్యాడు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి ముందున్నపుడు రథచక్రం భూమిలో కూరుకుపోయి...పరశురాముని ఇచ్చిన శాపం కారణంగా..నేర్చుకున్న విద్య గుర్తుకు రాక ...అర్జునుడి చేతిలో మరణిస్తాడు. మహాభారతం లో కర్ణుడు ఓ ప్రత్యేకమైన వ్యక్తి.