KTR: కేటీఆర్‌కి రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులు

మహిళా కమిషన్ ముందు హాజరవ్వడానికి వెళ్లిన ఆయనకు మహిళా కమిషన్ సభ్యులు రాఖీలు కట్టారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ ప్రత్యేకంగా ఇచ్చిన నిధులతో కార్యాలయాన్ని అద్భుతంగా రీనోవేట్ చేయించుకున్నామని మహిళా సభ్యులు తెలిపారు.


Published Aug 24, 2024 12:04:12 PM
postImages/2024-08-24/1724481252_KTRRAKHI.jpg

న్యూస్ లైన్ డెస్క్: కార్యాలయంలో మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మహిళా కమిషన్ సభ్యులు రాఖీలు కట్టారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్ నుంచి మహిళా కమిషన్ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లిన విషయం తెలిసిందే.

ఆయనతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వాకిటి సునీత, సత్యవతి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, ఇతర పార్టీ నేతలు కూడా మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. మహిళా కమిషన్ ముందు హాజరవ్వడానికి వెళ్లిన ఆయనకు మహిళా కమిషన్ సభ్యులు రాఖీలు కట్టారు.

గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ ప్రత్యేకంగా ఇచ్చిన నిధులతో కార్యాలయాన్ని అద్భుతంగా రీనోవేట్ చేయించుకున్నామని మహిళా సభ్యులు తెలిపారు. కాగా, మరికాసేపట్లో మహిళా కమిషన్ అధికారులు కేటీఆర్‌తో విచారణ జరిపే అవకాశం ఉంది. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu brs ktr telanganam ktrbrs

Related Articles