Nayanthara: నయనతార మంచి మనసు.. కేరళకు భారీ సాయం..!

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల్లోనే కాదు సహాయం చేయడంలో కూడా ముందుంటుంది అని మరొకసారి రుజువు చేసుకుంది. తాజాగా కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి ప్రకృతి విలయ తాండవం


Published Aug 02, 2024 07:16:12 AM
postImages/2024-08-02/1722600183_kerala.jpg

న్యూస్ లైన్ డెస్క్: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల్లోనే కాదు సహాయం చేయడంలో కూడా ముందుంటుంది అని మరొకసారి రుజువు చేసుకుంది. తాజాగా కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి ప్రకృతి విలయ తాండవం సృష్టించింది. దీంతో ప్రకృతి కన్నెర్రజేయడంతో అక్కడున్న చాలామంది ప్రజలు మరణించారు.దాదాపు 300 పైగా జనాలు మరణించారు.

మరి కొంత మంది కొండచరియల కింద,బురద కింద ఇరుక్కున్నారు. ప్రస్తుతం రెస్యూ టీం బురద కింద,కొండ చరియల కింద ఉన్న వారిని బయటికి తీస్తుంది. ఇక అక్కడి వారి పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరికి కన్నీళ్లురాక తప్పవు. కుటుంబ సభ్యులు కానరాని లోకానికి వెళ్లడంతో ఒంటరైన పిల్లలు, తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. వయనాడు ప్రాంతంలో ఉన్న వారి జీవితాలు మొత్తం ఒక్కసారిగా అస్తవ్యస్తమయ్యాయి.

దీంతో వారి పరిస్థితిని చూసి చాలా మంది సెలబ్రిటీలు విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్ అయినా సూర్య, జ్యోతిక అలాగే హీరో కార్తీ ముగ్గురూ కలిసి 50 లక్షల భారీ విరాళం అందజేశారు. అంతేకాకుండా హీరోయిన్ రష్మిక మందన్నా తన వంతుగా 10 లక్షల సహాయం చేసింది. ఇక వీళ్లే కాకుండా నజ్రియా నజీమ్, ఫహద్ ఫాజిల్ లు 25 లక్షలు,మమ్ముట్టి 20 లక్షలు, విక్రమ్ 20 లక్షలు,దుల్కర్ సల్మాన్ 15 లక్షలు విరాళంగా ఇచ్చారు.

అయితే తాజాగా కోలీవుడ్ సెలబ్రిటీ జంట అయినటువంటి నయనతార విగ్నేష్ శివన్ లు కూడా కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి తమ వంతు సహాయంగా 20 లక్షలు అందిస్తున్నట్టు తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయాన్ని విగ్నేష్ శివన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బయటపెట్టారు. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో నయనతార దంపతులను అభిమానులు మెచ్చుకుంటున్నారు.

https://www.instagram.com/p/C-KgMH3SjRL/?utm_source=ig_web_copy_link

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nayanthara rashmika-mandanna wayanad kerala suriya

Related Articles