Thorrur: దళితబంధు కోసం ట్యాంక్ ఎక్కి VRA ఆందోళన

తనకు దళిత బంధు పథకం డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. స్థానికులు సర్ధిచెప్పినప్పటికీ వినిపించుకోకుండా ట్యాంక్ పైనుండి వేలాడుతూ ఆందోలన చేశాడు. చేసేదేమీ లేక స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


Published Aug 03, 2024 12:30:14 PM
postImages/2024-08-03/1722668414_vra.jpg

న్యూస్ లైన్ డెస్క్: దళితబంధు కోసం విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేశాడు. వరంగల్ జిల్లా తొర్రూర్, ఇనుగుర్తి మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. VRA పప్పుల కుమార్ జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ ఆవరణంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కాడు. 

తనకు దళిత బంధు పథకం డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. స్థానికులు సర్ధిచెప్పినప్పటికీ వినిపించుకోకుండా ట్యాంక్ పైనుండి వేలాడుతూ ఆందోలన చేశాడు. చేసేదేమీ లేక స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు VRAని కిందకు దించి.. ఠాణాకు తరలించారు. 

newsline-whatsapp-channel
Tags : telangana news-line newslinetelugu congress-government warangal thorrur

Related Articles