Jagadish Reddy: స్పీకర్‌ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు 2024-06-26 15:20:01

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ పార్టీ బీ ఫామ్ పైన గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమైన పని అని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఇద్దరి సభ్యతం రద్దు కావల్సి ఉందన్నారు. నిన్నటి నుండి స్పీకర్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నామని.. మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆసహనం వ్యక్తం చేశారు. మాకున్న ఇతర మార్గాల ద్వారా ఒకటి స్పీడ్ పోస్టు, ఇంకోటి ఈ-మెయిల్ ద్వారా ఇద్దరిపై అనర్హత వేటు వెయ్యాలని ఫిర్యాదు చేశామని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు. లేదంటే న్యాయపరంగా ముందుకు వెళ్తామని, పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుందని విమర్శించారు. పాంచ్‌ న్యాయ్‌లో భాగంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మేనిఫెస్టోలో పెట్టారని, మళ్ళీ వారే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సిగ్గుమాలిన పనులు చెయ్యొద్దని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డే చెప్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కేసీఆర్ దగ్గరకు వచ్చి కండువాలు కప్పుకున్నారని గుర్తు చేశారు. చట్టం ప్రకారం 2/3 వంతు బీఆర్‌ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మా అధినేత కేసీఆర్ దగ్గరకు వస్తారు, తప్పు ఏముంది ప్రజలే తండోపతండాలుగా కేసీఆర్‌ను కలవడానికి వస్తున్నారని తెలిపారు.