సికింద్రాబాద్ రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న రైల్వే పొలీసులు ప్రత్యేక తనికీలు నిర్వహించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో నిషేదిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యం వెలుగుచూసింది. సికింద్రాబాద్ రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న రైల్వే పొలీసులు ప్రత్యేక తనికీలు నిర్వహించారు. ఈ క్రమంలో చాలా అనుమానంగా కనిపించిన ఓవ్యక్తి లగేజీని చెక్ చేశారు. అందులో దాదాపు 26.885 కేజీల గంజాయిని గుర్తించారు. అనంతరం బ్యాగ్ ను స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.