Anant Radhika wedding:అనంత్ రాధిక పెళ్లికి కట్న కానుకలు.. ఎంత వేశారంటే.?

జూలై 12 ముంబై నగరం అంతా కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసిన ట్రాపిక్ ఆంక్షలు. ఆ నగరం మొత్తం పెద్దపెద్ద విఐపిలు, హెలికాప్టర్లు మరియు అత్యంత ఖరీదైన కార్లు రోడ్లపై ప్రయాణిస్తున్నాయి. అడుగడుగునా పోలీసులు,  సెక్యూరిటీ సిబ్బంది.  ఇంతకీ ఆరోజు ఏం జరిగిందంటే దేశంలోనే అత్యంత ధనికుడైనటువంటి ముఖేష్ అంబానీ రెండవ కొడుకు అనంత్ అంబానీ రాధిక మర్చంట్  వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు  ప్రపంచ దేశాలలోని ఎంతోమంది ప్రముఖులతో పాటు దేశంలోని చాలామంది ప్రముఖులు హాజరయ్యారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-17/1721192132_radhika.jpg

న్యూస్ లైన్ డెస్క్: జూలై 12 ముంబై నగరం అంతా కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసిన ట్రాపిక్ ఆంక్షలు. ఆ నగరం మొత్తం పెద్దపెద్ద విఐపిలు, హెలికాప్టర్లు మరియు అత్యంత ఖరీదైన కార్లు రోడ్లపై ప్రయాణిస్తున్నాయి. అడుగడుగునా పోలీసులు,  సెక్యూరిటీ సిబ్బంది.  ఇంతకీ ఆరోజు ఏం జరిగిందంటే దేశంలోనే అత్యంత ధనికుడైనటువంటి ముఖేష్ అంబానీ రెండవ కొడుకు అనంత్ అంబానీ రాధిక మర్చంట్  వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు  ప్రపంచ దేశాలలోని ఎంతోమంది ప్రముఖులతో పాటు దేశంలోని చాలామంది ప్రముఖులు హాజరయ్యారు.

కన్నుల పండుగగా జరిగినటువంటి ఈ వివాహ వేడుకకు ముఖేష్ అంబానీ కోట్లాది రూపాయల ఖర్చు చేశారని తెలుస్తోంది. దేశంలోని అత్యంత ఖరీదైన పెళ్లిగా అనంత్ అంబానీ పెళ్లి రికార్డుల్లోకి ఎక్కింది. దాదాపుగా రూ:5000కోట్లకు పైగానే ఖర్చు చేసినట్టు సమాచారం. అంతేకాకుండా వివాహానికి వెళ్లిన వారికి కూడా ఖరీదైనటువంటి గిఫ్ట్ లను కూడా అందించారట. ఈ విధంగా  పెళ్లిలో ఏమాత్రం అతిధులకు తక్కువ కాకుండా చూసుకున్నటువంటి  అంబానీ ఫ్యామిలీకి వెళ్లినటువంటి అతిథులు కట్నం చదివింపులు ఎంత వేశారు అనేదానిపై సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.

నేటిజన్స్ ఫన్నీగా కామెంట్లు పెడుతూ  ఉన్నారు. అంత పెద్ద కోటీశ్వరునికి కట్నాలు కానుకలు ఇచ్చేవారు ఎవరు ఉంటారు. నిజానికి దేశంలో ఆయన కంటే ధనికులు ఎవరూ లేరు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే అంబానీ ఆస్తులతో పోలిస్తే,ఆయన పెళ్లికి పెట్టిన ఖర్చు 0.2% మాత్రమే ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. ఆయన ఆస్తితో పోల్చుకుంటే ఇది చాలా పూర్ మ్యారేజ్ అని పరిగణిస్తూ ఉన్నారు. అయితే ఈ మ్యారేజ్ చేసినందుకు అంబానీ దేశ ప్రజల నుంచి, తలా ఇంత కట్నాలు కూడా తీసుకుంటున్నారని, ఆ డబ్బులతోనే అతిధులను అంగరంగా వైభవంగా అతిథ్యం ఇచ్చారని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

 ఇంతకీ దేశ ప్రజలు అనంత్ పెళ్లికి వేసిన కట్నాలు ఏంటంటే జియో రీఛార్జ్ లు పెంచడం. ఈ పేదింటి పెళ్లికి  జియో సిమ్ వాడే ప్రతి ఒక్కరు నెలకు 349 రూపాయల రీఛార్జ్ చేసుకొని కట్నం కానుకల కింద అప్పజెప్పాలని కామెంట్లు పెట్టుకుంటున్నారు. ఈ పోస్టు నెట్టింటా విపరీతంగా వైరల్ అవ్వడంతో  చాలామంది నవ్వుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటో కూడా చెప్పండి.

newsline-whatsapp-channel
Tags : news-line marriage ananth-ambani radhika-marchant mukesh-ambani

Related Articles