Committee  Kurrollu: ఆకట్టుకుంటున్న "కమిటీ కుర్రోళ్ళు" ట్రైలర్..!

నిహారిక కొణిదెల నిర్మాతగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన తాజా మూవీ కమిటీ కుర్రోళ్ళు.. యధు వంశీ దర్శకత్వంలో దాదాపు 20 మంది కొత్త ఆర్టిస్టులతో తెరకెక్కిన  కమిటీ కుర్రోళ్ళు మూవీకి సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన టీజర్, పాటలు అందర్నీ ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే నిహారిక నిర్మాతగా చేస్తున్న కమిటీ కుర్రోళ్ళు మూవీ ఆగస్టు 9న విడుదలకు సిద్ధంగా ఉంది. దాంతో తాజాగా విడుదలైన ట్రైలర్ చూసిన జనాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.


Published Jul 26, 2024 01:47:37 PM
postImages/2024-07-26/1721981857_trailer.jpg

న్యూస్ లైన్ డెస్క్: నిహారిక కొణిదెల నిర్మాతగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన తాజా మూవీ కమిటీ కుర్రోళ్ళు.. యధు వంశీ దర్శకత్వంలో దాదాపు 20 మంది కొత్త ఆర్టిస్టులతో తెరకెక్కిన  కమిటీ కుర్రోళ్ళు మూవీకి సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది.

అయితే ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన టీజర్, పాటలు అందర్నీ ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే నిహారిక నిర్మాతగా చేస్తున్న కమిటీ కుర్రోళ్ళు మూవీ ఆగస్టు 9న విడుదలకు సిద్ధంగా ఉంది. దాంతో తాజాగా విడుదలైన ట్రైలర్ చూసిన జనాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి 20 మంది కొత్త వాళ్లను నిహారిక పరిచయం చేస్తుంది.

ముఖ్యంగా ఈ సినిమా 90 స్ కిడ్స్ కి బాగా సెట్ అవుతుందని,అప్పట్లో ఉండే జాతరలు, స్నేహితుల మధ్య గొడవలు, కొట్లాటలు, పశ్చాతాపాలు ఇలా అన్ని ఎమోషన్లని ఈ సినిమాలో చూడవచ్చు.ట్రైలర్ స్టార్టింగ్ లోనే గోదావరి జిల్లాల్లో ఉండే జాతరల గురించి తెలుసుకోవడం వంటివి చూపించారు.

అలాగే ఇందులో స్నేహితుల మధ్య గొడవలు, రాజకీయ పార్టీలు ఇలా ఎన్నో చూపించారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కి మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ ట్రైలర్ చూసి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే అని అందరూ భావిస్తున్నారు.మరి ఆగస్టు 9న విడుదల అయ్యే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

https://youtu.be/zFFJM7UQwdc

newsline-whatsapp-channel
Tags : newslinetelugu niharika committee-kurrallu-movie yadu-vamshi committee-kurrallu-trailer pink-elephant-pictures-banner

Related Articles