MLC: ప్రమాణస్వీకారం చేసిన కొత్త ఎమ్మెల్సీలు

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. 
 


Published Aug 16, 2024 11:53:20 AM
postImages/2024-08-16/1723789400_kodandaram.jpg

న్యూస్ లైన్ డెస్క్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొపెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు.  తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేడు తన ఛాంబర్లో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, విప్ బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. 

ప్రమాణస్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడిన కోదండరాం.. మండలిలో సభ్యుడిని కావడం సంతోషంగా ఉందని అన్నారు. అవకాశం ఇచ్చిన గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. ఎందరో బలిదానాల వల్లే తెలంగాణ వచ్చిందని అన్నారు. ప్రజల, అమరుల ఆకాంక్షల మేరకు పనిచేస్తానని హామీ ఇచ్చారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu tspolitics kodandaram ameer-ali-khan

Related Articles