కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో మధ్య జరిగినటువంటి కొండ చరియలు విరిగిపడిన ఘటనలో వందలాదిమంది మరణించారు. ఈ ఘటనలో ఇంకా చాలామంది నిరాశ్రయులయ్యారు. కొండచరియలు
న్యూస్ లైన్ డెస్క్: కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో మధ్య జరిగినటువంటి కొండ చరియలు విరిగిపడిన ఘటనలో వందలాదిమంది మరణించారు. ఈ ఘటనలో ఇంకా చాలామంది నిరాశ్రయులయ్యారు. కొండచరియలు విరిగిపడి ఇండ్ల మీదికి రావడంతో రహదారులన్నీ నాశనం అయ్యాయి. దీంతో చాలామంది ప్రజలు నిరాశ్రయులు అయిపోయారు. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయిపోయి వారికి భారీ సహాయ, సహకారాలు అందిస్తున్నారు.
ముఖ్యంగా ఆర్మీ సిబ్బంది అయితే వారిని కాపాడుకోవడం కోసం ఎంతో కష్టపడుతోంది.. అలాంటి ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు వయనాడ్ జిల్లాలోని బాధితుల కోసం విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే మలయాళ హీరో మోహన్ లాల్ బాధితులకు మూడు కోట్ల విరాళం ప్రకటించగా, తాజాగా ప్రభాస్ రెండు కోట్ల విరాళాలు ప్రకటించారు, తర్వాత చిరంజీవి, రామ్ చరణ్ కోటి రూపాయలకు పైగా విరాళాన్ని అందించారు.
ఈ విధంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ రెండు కోట్ల విరాళం అందించడంతో ప్రభాస్ అభిమానులంతా పేదల దేవుడు ప్రభాస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. వీళ్లే కాకుండా సూర్య, జ్యోతిక,కార్తి లక్షలాది రూపాయల విరాళాలు ప్రకటించారు.