Shocking News : క్లాస్ రూమ్ గోడ కిందపడ్డ విద్యార్థులు

తరగతిలో ఉండగానే.. గోడకూలి విద్యార్థులు గాయపడ్డ ఘటన గుజరాత్ లో జరిగింది. మధ్యాహ్న భోజన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-20/1721484778_schoolwall.jpg

న్యూస్ లైన్ డెస్క్ : విద్యార్థులు క్లాస్ రూమ్ లో ఉండగానే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న గోడ కూలి విద్యార్థులు కింద పడ్డ ఘటన మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో జరిగింది.  లంచ్ టైమ్ లో అన్నం తిని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో క్లాస్ రూమ్ గోడ కూలి బెంచీలతో సహా స్టూడెంట్స్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పోయారు. గుజరాత్.. వడోదరాలోని వాఘోడియా రోడ్డులో ఉన్న శ్రీ నారాయణ్ గురుకుల పాఠశాలలో మొదటి అంతస్తులోని తరగతి గది గోడ కూలి బెంచీలతో సహా ఆరుగురు విద్యార్థులు కింద పడిపోయారు.

మధ్యహ్నం 12:30 సమయంలో భోజన విరామ సమయంలో ఈ ఘటన జరిగినట్టు పాఠశాల ప్రిన్సిపల్ రూపల్ షా తెలిపారు. లంచ్ చేస్తున్న సమయంలో పెద్ద శబ్దం వినపడగానే భయంతో బయటకు వచ్చి చూశామని.. గోడ కూలి విద్యార్థులు హాహాకారాలు చేస్తూ కనిపించారని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఘటనపై వడోదల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు జరుపుతున్నారు.

 

 

newsline-whatsapp-channel
Tags : viral viral-news national school

Related Articles