SONUSOOD: బాలీవుడ్ కు చేరుకున్న కుమారీ ఆంటీ క్రేజ్ !

Published 2024-07-05 13:06:34

postImages/2024-07-05/1720164994_SonuSoodatKumariAuntysFoodStall.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నేమ్ , ఫేమ్ రెండు సోషల్ మీడియా గేమ్స్...యేడాది ముందు వరకు ఈ సోషల్ మీడియా మ్యాజిక్ లో కుమారి ఆంటీ లేనేలేదు..చాలా మంది యూట్యూబర్స్ వ్లాగ్స్ , వీడియోస్ పోస్ట్ చేసేసరికి ..హైదరాబాద్ కు ఇప్పుడు కుమారీ ఆంటీ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఈమె క్రేజ్ ఇఫ్పుడు ఎలా ఉందంటే హైటెక్ సిటీ రోడ్లు ఖాళీ ఉండడం లేదు. ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

చాలా మంది యూట్యూబర్స్‌.. ఈమె ఫుడ్‌ స్టాల్‌ దగ్గరకు వెళ్లి వ్లాగ్స్‌, వీడియోలు చేసి పోస్ట్‌ చేయడంతో ఈమెకు ఎక్కడా లేని క్రేజ్‌ పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో పోలీసులు కుమారి ఆంటీ మీద కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో ఆమె పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది.చిన్న చిన్న షోస్ లో కూడా కనిపించారు. ఆమె బిగ్‌బాస్‌ సీజన్‌ 8 కంటెస్టెంట్‌గా సెలక్ట్‌ అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా రియల్‌ హీరో సోనూ సూద్‌ కుమారి ఆంటీని సన్మానించారు. 

కోవిడ్ టైంలో సోనూసూద్ చేసిన సాయం జనాలు మరిచిపోరు. చాలా మంది రైతులకు..ఎందరో ఉద్యోగులకు ..చిన్న చితకా సాయాలు చేస్తూనే ఉంటాడు. ఇప్పటికి సోషల్ మీడియా వేదికగా ...తనను సాయం కోరే వారు చాలా మందే ఉన్నారు.  రీసెంట్ గా సోనూసూద్ తన సినిమా ఫతే  మేకింగ్ జరుగుతుంది . త్వరలోనే ఇది విడుదల కానుంది. కుమారీ ఆంటీ క్రేజ్ విని ..సోనూసూద్ తనను కలిసారు. నిజమైన ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌కు కుమారి ఆంటీనే నిదర్మనమన్నారు సోనూసూద్.

కుమారి ఆంటీ తో చిన్న చిట్ చాట్ స్టార్ట్ చేశారు సోనూసూద్ ..తాను వెజిటేరియన్ అని ఆ మీల్స్‌ ప్లేట్ ఎంత అని అడిగితే కుమారి ఆంటీ 80 రూపాయలు అని చెప్పింది.అయితే తనకి ఎంత డిస్కౌంట్ ఇస్తారు అని సోనూసూద్‌ ప్రశ్నించగా.. అందుకు కుమారి ఆంటీ మీకైతే ఫ్రీగానే పెడతానని చెప్పుకొచ్చింది. అలా అయితే ఫ్రీ గా రోజు తింటానని నవ్వారు. కుమారి ఆంటీ సత్కరించిన సోనూసూద్ తన కుటుంబంతో ..ఫొటోలు దిగారు.