ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఏప్రిల్ 15వ తేదీన అఫిషియల్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. స్కూల్ విద్యాశాఖ తెలిపిన వివరాల ప్రకారం జూన్ 15నుంచి 30 వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఏప్రిల్ 15వ తేదీన అఫిషియల్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.
ఏప్రిల్ 15 నుంచి 30 వతేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 15 నుంచి 30 వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జులై 22 వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారు. ఒక పేపర్ రాసేవారికి రూ.500 రెండు పేపర్లు రాసే వారికి 1000 ఫీజు కట్టాల్సి ఉంటుంది. జూన్ 9 వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ లో ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని గతేడాది జులైలో ప్రకటించింది. ఇందులో భాగంగా గత ఏడాది డిసెంబర్ లో టెట్ నోటిపికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించింది. జనవరిలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, రెండు లక్షల మందికి పైగా హాజరయ్యారు.