చక్కని రూపంతో అమ్మాయి అందంగా ..చాలా క్యూట్ గా ఉండడంతో కెమరాలు ఆ అమ్మాయిని ఫోకస్ చేశాయి
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దుబాయ్ వేదికగా మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోపీ సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఇండియన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఇదిలా ఉంటే ఆ మ్యాచ్ లో ఓ అందమైన అమ్మాయి పై కెమరా కన్ను పడింది. ఇప్పడు ఎక్కడ చూడు ఆ అమ్మాయే సూపర్ వైరల్ అవుతుంది.
అమ్మాయి దుబాయ్ స్టేడియంలో మ్యాచ్ చూస్తోంది. టీమిండియా జెర్సీ ధరించిన ఆమె తన ఫోన్లో మ్యాచ్ను వీడియో తీస్తోంది. అయితే చక్కని రూపంతో అమ్మాయి అందంగా ..చాలా క్యూట్ గా ఉండడంతో కెమరాలు ఆ అమ్మాయిని ఫోకస్ చేశాయి. ఇంకేముంది సోషల్ మీడియా అదృష్టం వరించింది. రాత్రికి రాత్రే ఫేమ్ ..నేమ్ ...సర్చింగులు స్టార్ట్ అయ్యాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీవీ స్క్రీన్ పై కూడా కనిపించింది. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
@Poojayadav206 అనే ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల మంది వీక్షించారు. దాదాపు 6 నుంచి 9 వేల మంది అమ్మాయి అకౌంట్ ను ఫాలో కొట్టారు. ఆమె చాలా అందంగా ఉందని బాలీవుడ్ హీరోయిన్ లా ఉందంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.