Assam:డ్రైవర్ ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు !

దీస్ పూర్ లోని ఎమ్మెల్యేల గెస్ట్ హౌస్ లో సోమవారం నాడు ఈ సంఘటన చోటు చేసుకుంది.


Published Mar 04, 2025 12:33:00 PM
postImages/2025-03-04/1741071996_prafulla1741025722.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత కూతురుకు చెందిన  వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. ఆ  వీడియోలో ఆమె ఓ వ్య‌క్తిని మోకాళ్ల‌పై కూర్చొబెట్టి చెప్పుతో కొట్ట‌డం క‌నిపిస్తోంది. దీస్ పూర్ లోని ఎమ్మెల్యేల గెస్ట్ హౌస్ లో సోమవారం నాడు ఈ సంఘటన చోటు చేసుకుంది.


అయితే త‌న తండ్రి దగ్గర గ‌త కొన్నేళ్లుగా డ్రైవ‌ర్‌గా పనిచేస్తున్న‌ట్లు మ‌హంత కుమార్తె తెలిపారు. నిత్యం మద్యం మత్తులో ఉండే అతడు తనతో దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించేవాడని ఆమె ఆరోపించారు. ఈ విష‌య‌మై చాలాసార్లు హెచ్చరించినా మారలేదంటూ చెప్పుకొచ్చింది.

సోమ‌వారం కూడా అత‌డు పూటుగా మ‌ద్యం సేవించి వ‌చ్చి, త‌న ఇంటి త‌లుపులు కొట్టాడ‌ని మ‌హంత కూతురు తెలిపారు. అందుకే ఇలా దేహ‌శుద్ధి చేసిన‌ట్లు చెప్పారు. అయితే, స‌ద‌రు డ్రైవ‌ర్‌పై ఇన్నాళ్లూ ఎందుకు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేద‌నే ప్ర‌శ్న‌కు ఆమె సమాధానం చెప్పలేదు. అయితే అస్సాం గణపరిషత్ మాజీ అధ్యక్షుడైన ప్రఫుల్ల కుమార్ మహంత ఆ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి చేశారు.


 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news

Related Articles