దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహాలివే..ఆ ఖర్చులతో రాష్ట్రాన్ని బాగు చేయొచ్చు.!

ప్రస్తుత కాలంలో  చాలామంది  పెళ్లి చేసుకునేటప్పుడు ఖర్చు విషయంలో అస్సలు వెనుకడుగు వేయడం లేదు.  పది రూపాయలు అప్పు అయినా సరే పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు.  దీనికి ప్రధాన కారణం పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి వస్తుంది, కాబట్టి ఖర్చు గురించి భయపడడం లేదు.  డబ్బు అయితే సంపాదించుకోవచ్చు పెళ్లిని మరోసారి చేసుకోలేం అనే ఆలోచనతో అంగరంగ వైభవంగా అన్ని హంగులతో వివాహాలు చేసుకుంటున్నారు. మరి సాధారణ మధ్యతరగతి, ప్రజలే ఈ విధంగా ఉంటే  ఇక ధనికుల పెళ్లిల విషయంలో  ఎలా ఉంటారు మనం అర్థం చేసుకోవచ్చు. మన ఇండియాలో పెళ్లిలకు పెట్టినంత ఖర్చు దేనికి పెట్టరు. అలా ఇండియాలోనే  అత్యధికంగా ఖర్చుపెట్టి వివాహాలు  చేసుకున్న జంటలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో టాప్ 5 వివాహాలు ఏంటో చూద్దాం..


Published Jul 12, 2024 10:37:51 AM
postImages/2024-07-12//1720760871_costlymarraigesindia.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో  చాలామంది  పెళ్లి చేసుకునేటప్పుడు ఖర్చు విషయంలో అస్సలు వెనుకడుగు వేయడం లేదు.  పది రూపాయలు అప్పు అయినా సరే పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు.  దీనికి ప్రధాన కారణం పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి వస్తుంది, కాబట్టి ఖర్చు గురించి భయపడడం లేదు.  డబ్బు అయితే సంపాదించుకోవచ్చు పెళ్లిని మరోసారి చేసుకోలేం అనే ఆలోచనతో అంగరంగ వైభవంగా అన్ని హంగులతో వివాహాలు చేసుకుంటున్నారు. మరి సాధారణ మధ్యతరగతి, ప్రజలే ఈ విధంగా ఉంటే  ఇక ధనికుల పెళ్లిల విషయంలో  ఎలా ఉంటారు మనం అర్థం చేసుకోవచ్చు. మన ఇండియాలో పెళ్లిలకు పెట్టినంత ఖర్చు దేనికి పెట్టరు. అలా ఇండియాలోనే  అత్యధికంగా ఖర్చుపెట్టి వివాహాలు  చేసుకున్న జంటలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో టాప్ 5 వివాహాలు ఏంటో చూద్దాం..

#1. ఇషా అంబానీ:
 అనంత్ అంబానీ దేశంలోని అత్యంత ధనికుడు. కూతురు ఇషా అంబానీ  వివాహాన్ని కూడా చాలా అంగరంగ వైభవంగా చేశాడు. ఈమె వివాహానికి దాదాపుగా రూ:700 కోట్లకు పైగానే ఖర్చు చేశారట. ఈమె లేహంగా ఖరీదు రూ:90 కోట్లు, పెళ్లి కార్డు విలువ 3 లక్షల పైగానే ఉందట. 

#2. సుబ్రతారాయ్ కుమారులు:
  సుబ్రతారాయ్ తన ఇద్దరు కొడుకులకు అంగరంగ వైభవంగా వివాహం చేశారు. 2004లో జరిగినటువంటి ఈ వివాహానికి ఆయన రూపాయలు554 కోట్లకు పైగానే ఖర్చు చేశారట. ఈ వివాహానికి దేశ విదేశాల నుంచి దాదాపుగా 15వేల మందికి పైగా అతిథులు వచ్చారని తెలుస్తోంది. 

#3. గాలి జనార్దన్ రెడ్డి కూతురు:
 కర్ణాటక రాష్ట్రానికి చెందిన గాలి జనార్దన్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ప్రముఖ వ్యాపారవేత్త. ఈయన కూతురు వివాహానికి  రూ:500 కోట్లకు పైగానే ఖర్చు చేశారట. 2016 లో జరిగిన ఈ పెళ్లికి దాదాపుగా  50,000 మందికి పైగానే అతిధులు హాజరయ్యారట. 

#4.  ప్రమోద్ మీట్టల్ కూతురు:
 ఉక్కు వ్యాపారంలో అగ్రగన్యుడుగా ఉన్నటువంటి  ప్రమోద్ మిట్టల్  కూతురు సృష్టి మిట్టల్ వివాహం 2013 పారిస్ లో చేశారు. ఈ వివాహానికి 500 కోట్లు పైగా ఖర్చు చేశారట. మూడు రోజులపాటు జరిగినటువంటి ఈ పెళ్లికి వేలాది మంది ప్రముఖులు వచ్చారట. 

#5. లక్ష్మీ మిట్టల్ కుమార్తె:
 స్టీల్ టైకోన్ గా ప్రపంచంలో ప్రాముఖ్యత సాధించినటువంటి లక్ష్మీ మిట్టల్ తన కూతురు వివాహాన్ని 2004లో చేసిందట. పారీస్ లో జరిగినటువంటి ఈ వివాహ వేడుకకు రూ:240 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.   

 #6.ముఖేష్ అంబానీ కొడుకు:
 జూన్ 12న ముఖేష్ అంబానీ  కొడుకు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి జరుగుతోంది.  ఈ వివాహానికి దాదాపుగా దేశంలోనే ఎవరు కూడా ఖర్చు పెట్టనంత డబ్బు, ఖర్చు పెట్టి చేస్తున్నారని తెలుస్తోంది. ఈ పెళ్లి దేశంలో అత్యంత ఖరీదైన పెళ్లిగా నిల్వ ఉందని సమాచారం.

newsline-whatsapp-channel
Tags : marriage ananth-ambani radhika-marchant esha-ambani gali-janardanreddy

Related Articles