TTD: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. నవంబర్ కోటా దర్శనం టికెట్లు విడుదల!

రేపు అనగా శనివారం 300 టికెట్లు తిరుమల తిరుపతి రూమ్స్ కోటాను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.


Published Aug 23, 2024 08:57:00 AM
postImages/2024-08-23/1724383664_TTD.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ . నవంబర్ నెల కు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేసింది. ఈరోజు అంటే ఆగస్ట్ 23న అంగప్రదక్షిణ, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు, వయోవృద్ధులకు టికెట్లను రిలీజ్ చేస్తుంది. రేపు అనగా శనివారం 300 టికెట్లు తిరుమల తిరుపతి రూమ్స్ కోటాను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.


నవంబరు నెల గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఇక ఆగష్టు 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాల‌ని టీటీడీ భక్తులకు సూచించింది.


ప్రభుత్వం మారిన తర్వాత టీటీడీ లో గదుల కోసం , టికెట్ల కోసం మధ్యవర్తులను తగ్గించాలనే ఉద్దేశ్యంతో తిరుమల లో ఎక్కడిక్కడ రూమ్స్ , లాకర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ లో బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు టీటీడీ అధికారులు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu venkatewsra-temple tirupati

Related Articles