Journalist: కూతురికి ఉరి వేసి, తానూ చనిపోయిన జర్నలిస్ట్

తొలి వెలుగు ఛానల్ స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న యోగి రెడ్డి.. తన కూతురు ఆధ్యకు కూడా ఉరి వేశాడు. దీంతో చిన్నారి మృతిచెందింది. అనంతరం యోగి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. 
 


Published Aug 10, 2024 12:47:34 PM
postImages/2024-08-10//1723274254_newslinetelugu29.jpg

న్యూస్ లైన్ డెస్క్: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ జర్నలిస్ట్ తన తొమ్మిదేళ్ల కూతురికి ఉరి వేసి.. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తొలి వెలుగు ఛానల్ స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న యోగి రెడ్డి.. తన కూతురు ఆధ్యకు కూడా ఉరి వేశాడు. దీంతో చిన్నారి మృతిచెందింది. అనంతరం యోగి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. 

అయితే, తొలి వెలుగు రిపోర్టర్‌గా పనిచేస్తున్న యోగిని యూట్యూబ్ ఛానల్ నుంచి తొలగించారని ఆయన బంధువులు తెలిపారు. దీంతో యోగి ఉపాధి కోల్పోయాననే ఉత్తిడికి గురైనట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తన కుమార్తెకు ఉరి వేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు వెల్లడించారు. 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu telanganam journalist journalist-yogi-reddy

Related Articles