ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3,6,11 రాశుల్లో శని ఉన్నట్లయితే వారికి రాజయోగం పడుతుందని చెబుతున్నారు. ఆ మూడు రాశులు ఏంటంటే,
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కొన్ని రోజుల్లో తెలుగువారికి కొత్త సంవత్సరం మొదలవుతుంది.తెలుగు పంచాంగం ప్రకారం చైత్రశుద్దమాసం శుద్ద పాడ్యమి రోజున ఉగాది పండుగతో కొత్త ఏడాది మొదలవుతుంది. ప్రస్తుతంక్రోధి నామ సంవత్సరం నడుస్తుండగా , మార్చి 30 ఉగాది నుంచి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ టైంలో శని సంచారంలో మార్పు వల్ల మూడు రాశుల వారికి అఖండ రాజయోగం పడుతుందంటున్నారు జ్యోతిష్యులు. ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3,6,11 రాశుల్లో శని ఉన్నట్లయితే వారికి రాజయోగం పడుతుందని చెబుతున్నారు. ఆ మూడు రాశులు ఏంటంటే,
మకరం : 2025 మార్చి 30వ తేదీన శని భగవానుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ క్రమంలో మకర రాశి వారికి ఉగాది తర్వాత శని మూడో స్థానంలో సంచరిస్తున్నాడని, ఫలితంగా విశేష రాజయోగం కలుగుతుందని అంటున్నారు. చెబుతున్నారు. ఈ రాశి వారు కాస్త కష్టపడితే మీరు అనుకున్న పనులు అవుతాయి.
తుల : .2025 మార్చి 30వ తేదీ నుంచి తుల రాశి వారికి శని ఆరో స్థానంలో ఉంటాడని, ఈ కారణంగా సంవత్సరం మొత్తం శుభ ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. మీ అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఎంతటి అప్పులైనా తీరిపోతాయని చెబుతున్నారు. భయంకరమైన శత్రుబాధలు, దిష్టి దోషాలు పోతాయి. డబ్బు సంపాదిస్తారు.
వృషభం : ఈ రాశి వారికి శని లాభస్థానంలో ఉండటం వల్ల ఉగాది తర్వాత నుంచి ఈ రాశి వారికి విశేష శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. వీరికి వృత్తిపరమైన , ప్రమోషన్లు వస్తాయని కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.