Gold Rate: ఓరీ దేవుడా ...ఏంటి బంగారం ధర ఇంత దారుణంగా పెరిగింది !

విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.79,700 కాగా.. 24 క్యారట్ల ధర రూ.86,950 వద్ద కొనసాగుతుంది.


Published Feb 18, 2025 12:59:00 PM
postImages/2025-02-18/1739863906_355503gold.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర చుక్కలు చూపిస్తుంది. ప్రధానగరాలైన హైదరాబాద్ , విజయవాడ , విశాఖపట్టణంలో బంగారం ధర పెరిగింది . 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం గ్రాముపై రూ.330 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 300 పెరిగింది. దీంతో సోమ, మంగళవారాల్లో కలిపి 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ. 880 పెరిగింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.79,700 కాగా.. 24 క్యారట్ల ధర రూ.86,950 వద్ద కొనసాగుతుంది.


ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.79,850 కాగా.. 24 క్యారట్ల ధర రూ.87,100. అంటే ఆంధ్రా లో చాలా చోట్ల తులం బంగారం 11.600 మిల్లిగ్రాములు. అంటే మరో 8 వేల చిల్లర ఎక్కువ చెల్లిస్తారు. అంటే ఆంధ్రాలో విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో తులం బంగారం ధర 95వేలు . 


ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో బంగారం ధర ఒకేలా ఉంది.. 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.79,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.86,950. ధర నడుస్తుంది.


వెండి ధర కూడా ఇలానే పెరుగుతుంది. విజయవాడ, విశాఖపట్టణంతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో కిలో వెండి ధర రూ.1,08,000 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ , ముంబయి , కలకత్తా నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,00,500 . అదే చెన్నై లో అయితే కిలో వెండి ధర రూ. 1,08,000గా నమోదైంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate stock-market

Related Articles