Hero: ఆ హీరో పెళ్లికి తలనొప్పిగా మారిన కేరళ..?

కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి వర్షాలకు ఆ ప్రాంతం అస్తవ్యస్తమైపోయిన సంగతి మనకు తెలిసిందే. దాదాపు 300 మంది చనిపోయారు. అలాగే ఎంతో నష్టం జరిగిపోయింది.ఇప్పటికే కేరళలోని వయనాడ్


Published Aug 10, 2024 04:10:00 PM
postImages/2024-08-10/1723285297_keralakiranabbavaram.jpg

న్యూస్ లైన్ డెస్క్: కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి వర్షాలకు ఆ ప్రాంతం అస్తవ్యస్తమైపోయిన సంగతి మనకు తెలిసిందే. దాదాపు 300 మంది చనిపోయారు. అలాగే ఎంతో నష్టం జరిగిపోయింది.ఇప్పటికే కేరళలోని వయనాడ్ ప్రాంతానికి చాలామంది సెలబ్రిటీలు లక్షలు,కోట్లు ఇలా తమ స్థాయికి తగ్గట్లు విరాళాలు ఇస్తున్నారు. మోహన్ లాల్ మూడు కోట్లు, ప్రభాస్ రెండు కోట్లు, చిరంజీవి చరణ్ ఒక కోటి వంటి భారీ విరాళాలు కూడా ఇచ్చారు.

అలాగే తాజాగా మీనా, సుహాసిని,కుష్బూ వంటి హీరోయిన్స్  అందరూ కలిసి కోటి రూపాయల విరాళం స్వయంగా సీఎం పినరయ్ కి ఇచ్చారు. ఇక నయనతార,సూర్య, జ్యోతిక,కార్తీ,అల్లు అర్జున్,రష్మిక,కమల్ హాసన్,నజ్రియా ఫహద్ ఫాజిల్ ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు వారికి తోచినంత డబ్బులు కేరళలోని వయనాడ్ ప్రాంతంలో నష్టపోయిన వారికి విరాళాల రూపంలో అందజేశారు.అయితే కేరళలో పెద్ద విపత్తు వచ్చి ఆ రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలం కావడంతో ఓ హీరో పెళ్ళికి అడంకిగా మారిందట.

ప్రస్తుతం కేరళ ఆ హీరో పెళ్లికి తలనొప్పి అయ్యింది అని సోషల్ మీడియా టాక్ వినిపిస్తోంది.ఇక ఆ హీరో ఎవరో కాదు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం..రీసెంట్ గానే హీరోయిన్ రహస్య గోరఖ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ హీరో ఆగస్టు 22న పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అయితే రహస్య గోరఖ్ కిరణ్ అబ్బవరం ల పెళ్లి కేరళలో జరగబోతున్నట్టు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.

కానీ కేరళలో విపత్తు రావడంతో తన పెళ్లి వెన్యూని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి అదే రోజు జరుగుతున్నప్పటికీ పెళ్లి జరిగే ప్రదేశం మాత్రం కిరణ్ అబ్బవరం మార్చేసుకున్నారు.ఆయన తన పెళ్లిని కర్ణాటకలోని కూర్గ్ లో చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.కానీ ఇందులో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu karnataka- tollywood wayanad kerala kiran-abbavaram rahasya-gorakh

Related Articles