Shalini Pandey:మొగాళ్ళతో రూమ్ షేర్ చేసుకున్న.. డ్రెస్ చేంజ్ కోసం అలా చేసేదాన్ని.!

Published 2024-07-03 02:47:00
postImages/2024-07-02/1719930921_shalini1.jpg

న్యూస్ లైన్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే మామూలు విషయం కాదు.  అది అబ్బాయిలంటే ఎలాగోలా కష్టపడతారు కానీ అమ్మాయిలు ఇంట్లో ఒప్పించి, ఇండస్ట్రీలోకి వచ్చి  అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సమయంలో డైరెక్షన్ లో నుంచి మొదలు నిర్మాతల వరకు ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం.  అవన్నీ తట్టుకొని బయటపడి స్టార్స్ గా ఎదిగిన హీరోయిన్లు ఎంతోమంది. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శాలిని పాండే.

ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తాను అంటే తన తండ్రి అసలు ఒప్పుకోలేదట. నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ చేయాలని మా నాన్నకు ఉండేది. అని నాకు అది ఇష్టం ఉండేది కాదు ఎలాగైనా సినిమాల్లోకి రావాలని చదువు మధ్యలోనే మానేసి నేను పారిపోయి ముంబై వచ్చాను. అక్కడ నా ఫ్రెండ్స్ రూమ్ లో ఉన్నాను. వారితో నాకు ఉండడం నచ్చలేదు. ఆ తర్వాత  మగవాళ్ళతో రూమ్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది.  అయినా నేను భయపడకుండా వారితో ఉన్నాను. కనీసం తినడానికి కూడా తిండి దొరికేది కాదు. ఒకటే రూము.  బట్టలు మార్చుకోవడానికి కూడా స్థలం ఉండేది కాదు. అయినా భయపడకుండా వారితో ధైర్యంగా ఉండగలిగాను.

వాళ్ల మధ్య ఉన్న కానీ  చాటుగా ఉంటూ బట్టలు మార్చుకోవాల్సి వచ్చేది. అలా సినిమా ఆఫర్ల కోసం ట్రై చేస్తున్న సమయంలోనే సందీప్ రెడ్డి డైరెక్టర్ నాకు  అర్జున్ రెడ్డి సినిమాలో ఆఫర్ ఇచ్చారు. నేను చేసిన మొదటి సినిమా అయినా కానీ ఈ చిత్రం భారీ విజయనందుకుంది. ఇందులో విజయ్ దేవరకొండ సరసన నాకు చాన్స్ దొరకడం నా అదృష్టం అనుకోవాలి. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయాను. ఆ తర్వాత మా కుటుంబ సభ్యులు నాకు మద్దతు ఇచ్చారు. ఇక ఈ చిత్రం తర్వాత  మహానటి సినిమాలో నాకు ఆఫర్ వచ్చింది. ఇందులో కూడా కీలక పాత్రలో చేశాను. ఆ తర్వాత బాలీవుడ్ లో టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వచ్చాయి  అంటూ చెప్పుకొచ్చింది శాలిని పాండే. ఆరోజు గనుక నేను భయపడి వెనుకడుగు వేసి ఉంటే ఈరోజు ఇలా ఉండే దాన్ని కాదు అంటూ చెప్పుకొచ్చింది.