యూపీ చెందిన ముగ్గురు , గోవా , మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి ఇద్దరు చొప్పున , హిమాచల్ ప్రదేశ్ , జమ్ముకాశ్మీర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: సెకండ్ బ్యాచ్ లో 199 మంది అక్రమవలసదారులు అమెరికా విమానంలో ఫిబ్రవరి 15 న రానున్నారు. ఈ విమానం శనివారం రాత్రి 10 గంటలకు విమానాశ్రయానికి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ సారి 119 మందిలో పంజాబ్ కు చెందిన వ్యక్తులు 67మంది హరియానాకు చెందిన 33 ,గుజరాత్ కు చెందిన ఎనిమిది మందిని , యూపీ చెందిన ముగ్గురు , గోవా , మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి ఇద్దరు చొప్పున , హిమాచల్ ప్రదేశ్ , జమ్ముకాశ్మీర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
అయితే మూడో బ్యాచ్ లో వస్తున్న మరో అమెరికా విమానం ఫిబ్రవరి 16న భారత్ లో ల్యాండ్ అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలిసిన కొన్ని గంటల తర్వాతే వలసదారులకు సంబంధించిన మరో రెండు విమానాల వార్త రావడం గమనార్హం.
అక్రమవలసలపై మోదీ కూడా కీలక స్టేట్మంట్స్ చేసింది. ఏ దేశానికైనా సరే అక్రమవలసదారులు అనేది చాలా పెద్ద సమస్య . ఏ దేశంలోకైనా అక్రమంగా వచ్చి అక్కడే ఉండిపోతామంటే కుదరుదు. అది ఆ దేశానికి ..సొంత దేశానికి చాలా మంచిది కాదు. ఇతర దేశాల్లోకి అడుగుపెట్టిన వారికి ఆయాదేశాల్లో హక్కు ఉండదని చెప్పారు. అమెరికా లో ఇలా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకొస్తామని చెప్పారు.