దరాబాద్ లో మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకతో పాటు ముగింపు వేడుకలు , గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తారు. ఈ పోటీలకు మొత్తం 120 దేశాల నుంచి అమ్మాయిలు పాల్గొంటున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ వేదిక కానుంది. మే 7 నుంచి మే 31 వరకు 72 వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ లో మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకతో పాటు ముగింపు వేడుకలు , గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తారు. ఈ పోటీలకు మొత్తం 120 దేశాల నుంచి అమ్మాయిలు పాల్గొంటున్నారు.ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ పర్యాటక, సంస్కృతి, యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ అధికారిక ప్రకటన చేశారు.
తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం ప్రపంచ వీక్షకులకు ఈ రాష్ట్ర గొప్ప వారసత్వం, వృద్ధిని చూపుతుందని చెప్పారు. తెలంగాణ మిస్ వరల్డ్ 2025కి ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఉందని సభర్వాల్ చెప్పారు. అయితే ఈ పోటీలను తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రెస్టేజియస్ గా నిర్వహించాలనుకుంటుంది.
మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకతో తెలంగాణ గొప్పదనం గురించి ప్రపంచానికి మరింత తెలుస్తుందని చెప్పారు. ఈ పోటీలకు దాదాపు 120 దేశాల నుంచి యువతులను ఒక చోట చేర్చుతుందని ప్రకటనలో అధికారులు తెలిపారు. టైటిల్ కోసమే కాకుండా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. చాలా దేశాల ప్రతినిధులు మే 7 న తెలంగాణకు వస్తారని అన్నారు.