భూకంపంపై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దశ రాజధాని ఢిల్లీ, చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఈరోజు ఉదయం బలమైన భూప్రకంపనలు సంభవించాయి. రెక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణనష్టమేమీ సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. భూకంపంపై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
ఈ భూకంపం కారణంగా సంభవించిన బలమైన ప్రకంపనల తో ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ లలో అనేక ఎత్తైన భవనాల నివాసితులు బయటకు పరుగులు తీశారు. భూకంపం వచ్చినపుడు పెద్ద పెద్ద శబ్ధాలు వచ్చాయని తెలిపారు. అంతేకాదు ఎత్తైన అపార్ట్ మెంట్స్ లో ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
టు ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిశీ కూడా ఈ భూకంపంపై స్పందించారు. "ఢిల్లీలో ఇప్పుడే బలమైన భూకంపం సంభవించింది. అందరూ సురక్షితంగా ఉండాలి" అని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అయితే మరోసారి భూకంపం వచ్చే అవకాశాలున్నాయంటున్నారు అధికారులు ..అయితే అధికారికంగా ఇది అనౌన్స్ చెయ్యలేదంటున్నారు ప్రజలు.