ప్రయాగ్ రాజ్ కు చేరుకున్న ప్రధాని యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ తో కలిసి త్రివేణి సంగమానికి వెళ్లారు. అరైల్ ఘూట్ నుంచి బోటులో సంగం ఘూట్ కు చేరుకున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ప్రధాని నరేంద్రమోదీ మహాకుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఉదయం ప్రయాగ్ రాజ్ కు చేరుకున్న ప్రధాని యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ తో కలిసి త్రివేణి సంగమానికి వెళ్లారు. అరైల్ ఘూట్ నుంచి బోటులో సంగం ఘూట్ కు చేరుకున్నారు. ఆ టైంలో ప్రధానమంత్రి మహాకుంభమేళా ప్రాంతం ..ఏర్పాట్లు ...వీటితో పాటు మహాకుంభమేళాలో అఘోరీలకు , సాధారణప్రజలకు జరిగే ఏర్పాట్లు తెలిపారు. ఆ తర్వాత సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ క్రమంలో ప్రధాని మోదీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు.
MOMENT OF THE DAY -
Prime Minister Narendra Modi takes holy dip in Sangam at Prayagraj Mahakumbh. pic.twitter.com/OZinjd4f6M — News Arena India (@NewsArenaIndia) February 5, 2025