వరుడు కూడా సీఆర్ పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కావడంతో రాష్ట్రపతి ఈ ప్రత్యేక అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: రాష్ట్రపతి భవన్ చరిత్రలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. తొలిసారి ఓ ఉద్యోగి వివాహానికి రాష్ట్రపతి భవన్ వేదిక కానుంది. రాష్ట్రపతి వ్యక్తిగత భద్రతాధికారి (పీఎస్ వో) గా విధులు నిర్వహిస్తున్న సీఆర్ పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా వివాహం జరుపుకునేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక అనుమతిచ్చారు. దీంతో ఈ నెల 12 న పూనమ్ గుప్తా వివాహం రాష్ట్రపతి భవన్ లోన మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్ లో జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ లో ఈ సీఆర్ పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గా పనిచేస్తున్న అవనీశ్ కుమార్ తో పూనమ్ గుప్తా పెళ్లి చేసుకోబోతున్నారు.
వరుడు కూడా సీఆర్ పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కావడంతో రాష్ట్రపతి ఈ ప్రత్యేక అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. భధ్రతాపరమైన కారణాల వల్ల చాలా తక్కువ మంది బంధువులు , అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందుతుందన్నారు. అయితే పూనమ్ గుప్తా 2018 లో యూపీఎస్సీలో 81 వ ర్యాంక్ సాధించారు. రీసెంట్ గా గణతంత్ర వేడుకల్లో సీఆర్ పీ ఎఫ్ మహిళా దళానికి పూనమ్ గుప్తా సారథ్యం వహించారు.