AP Budget: నేడు అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం !

సూపర్ 8 పథకాలు , రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్ లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.


Published Feb 28, 2025 07:10:00 AM
postImages/2025-02-28/1740706923_1894618pawankalyan.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఏపీలోని కూటమి ప్రభుత్వం నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ , మండలిలో మరోసారి మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు. సూపర్ 8 పథకాలు , రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్ లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.


2025-2026 కు గాను సుమారు రూ. 3.20 లక్షల కోట్ల అంచనాలతో ఈ బడ్జెట్ ఉండనుంది. అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించినట్లు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి భేటి అవుతుంది. ఈ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదించనున్నారు.అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు అసెంబ్లీలో మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.  

newsline-whatsapp-channel
Tags : ap-news andhrapradesh assembly-budget-session

Related Articles