మిగిలిన మూడు స్థానాలకు కూడా అభ్యర్థులను డీఎంకే ప్రకటించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : లోకనాయకుడు , మక్కల్ నీది మయ్యం అధినేత కమలహాసన్ ను రాజ్యసభ అభ్యర్ధిగా ప్రకటిస్తూ ద్రవిడ మున్నేట్రకజగం కీలక నీర్ణయం తీసుకుంది.తమిళనాడులో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ సీట్లలో ఒక దాన్ని కమల కు కేటాయించింది. దీంతో కమల హాసన్ పార్లమెంట్ లో అడుగు పెట్టడానికి తొలి అడుగు పడింది. అయితే కమలహాసన్ తో పార్టీతో గతంలో జరిగిన అగ్రిమెంట్ మేరకు తాము ఆ పార్టీకి ఒక రాజ్యసభ సీటును కేటాయిస్తున్నట్లు డీఎంకే అధినేత స్టాలిన్ ఓ ప్రకటన లో తెలిపారు. మిగిలిన మూడు స్థానాలకు కూడా అభ్యర్థులను డీఎంకే ప్రకటించింది. పార్టీ సిట్టింగ్ ఎంపీ, సీనియర్ న్యాయవాది పి. విల్సన్, సేలం తూర్పు జిల్లా సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్ఆర్ శివలింగంతోపాటు పార్టీ అధికార ప్రతినిధి, ప్రముఖ రచయిత రొక్కాయ్ మాలిక్ కు సీట్లు కేటాయించింది.
సల్మా (ముస్లిం) , విల్సన్ (క్రిస్టియన్), శివలింగం (హిందువు).. ఇలా ఒక్కో మతం నుంచి ఒక్కొక్కరికి సీటు కేటాయించింది. కమల్ పార్టీ 2024 లో డీఎంకే తో పొత్తు కుదుర్చుకుంది.జూన్ 9 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి.