kirishnaveni: సీనియర్ నటి కృష్ణవేణి ఇక లేరు !

ఓ సినిమాకు ప్రొడ్యూసర్ గా చేస్తూనే ఎన్టీఆర్ తో జంటగా హీరోయిన్ గా కూడా చేస్తున్నారు.


Published Feb 16, 2025 01:38:00 PM
postImages/2025-02-16/1739693411_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: సీనియర్ నటి కృష్ణవేణి కన్నుమూశారు ..ఆమె తన 102 యేళ్ల వయసులో చనిపోయారు. ఎన్ టీ ఆర్ , ఘంటసాల వెంకటేశ్వరరావు గాయని పి లీలా వంటి ఎంతోమందిని సినీ పరిశ్రమకు పరిచయం చేసిన అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి చనిపోయారు. సినీ పరిశ్రమకు ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్​టీఆర్‌, ఘంటసాల, గాయని పి.లీలా వంటి ప్రముఖులను 'మనదేశం'తో ఆమె తెలుగు తెరకు పరిచయం చేశారు. ఓ సినిమాకు ప్రొడ్యూసర్ గా చేస్తూనే ఎన్టీఆర్ తో జంటగా హీరోయిన్ గా కూడా చేస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో 1924 డిసెంబర్‌ 24న కృష్ణవేణి జన్మించారు. ఆమె తండ్రి వైద్యుడిగా పనిచేశారు. కృష్ణవేణి డ్రామా ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించారు. 1936 లో రిలీజైన సతీ అనసూయ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేశారు. 1939లో మీర్జాపురం జమీందార్‌తో ఆమె వివాహం జరిగింది. భర్తకు చెందిన శోభనాచల స్టూడియోస్ సారధ్యంలో చాలా సినిమాలకు కృష్ణవేణి నిర్మాతగా వ్యవహరించారు. 'దక్షయజ్ఞం', 'జీవన జ్యోతి', 'భీష్మ', 'గొల్లభామ', 'ఆహుతి' వంటి చిత్రాల్లో ఆమె నటించారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu

Related Articles